
జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామలతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 114.06 పాయింట్లు లాభంతో 60024 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 17742 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి.
హెచ్సీఎల్, టాటా మోటార్స్, ఎథేర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో, దివిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. అపోలో హాస్పిటల్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్, హెచ్యూఎల్, హీరోమోటో కార్ప్, సన్ ఫార్మా, టీసీఎస్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.