
బ్యాంక్ ఖాతాలు, షేర్లు, ఫండ్స్పై సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మెహుల్ చోక్సీ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఆదేశించింది. వీటిలో చోక్సీ బ్యాంక్ ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. జ్యువెలరీ కంపెనీ గీతాంజలి జెమ్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన కేసులో సెబీ రూ. 2.1 కోట్లు రికవర్ చేసుకునేందుకు తాజా ఆదేశాలు జారీ చేసింది. గత నెల 15న చోక్సీకి డిమాండ్ నోటీసు జారీ చేసిన సెబీ 15 రోజుల గడువు ముగియడంతో రికవరీ చర్యలకు తెరతీసింది.
ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు నేపథ్యంలో 2022 జనవరిలోనూ సెబీ జరిమానా విధించింది. అయితే చెల్లింపులు చేపట్టకపోవడంతో డిమాండ్ నోటీసు జారీ చేసింది. గీతాంజలి జెమ్స్ చైర్మన్, ఎండీ చోక్సీ ప్రమోటర్ గ్రూప్లోని వ్యక్తికావడంతోపాటు.. నీరవ్ మోడీకి మేనమామకూడా. ప్రభుత్వ రంగ పీఎన్బీలో రూ. 14,000 కోట్లమేర మోసానికి తెరతీసినట్లు ఇరువురిపైనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే పీఎన్బీని మోసగించిన అంశం వెలుగుచూసిన 2018 మొదట్లో వీరిరువురూ విదేశాలకు పారిపోగా.. చోక్సీని బెల్జియంలోనూ, మోడీని స్కాట్లాండ్లోనూ అక్కడి ప్రభుత్వాలు అరెస్ట్ చేయడం గమనార్హం!