మూడు బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా: భారీ జరిమానా.. | RBI Levies Penalties on Kotak Mahindra Bank IDFC First and PNB Bank | Sakshi
Sakshi News home page

మూడు బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా: భారీ జరిమానా..

Apr 18 2025 6:20 PM | Updated on Apr 18 2025 6:38 PM

RBI Levies Penalties on Kotak Mahindra Bank IDFC First and PNB Bank

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ & పంజాబ్ నేషనల్ బ్యాంకులకు జరిమానా విధించింది. వినియోగదారులకు అందించే సేవలలో లోపం, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆర్‌బీఐ ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్: లోన్ సిస్టమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను పాటించకపోవడం, ఇతర చట్టబద్ధమైన పరిమితులకు సంబంధించిన ఉల్లంఘనల కారణంగా ఆర్‌బీఐ..  కోటక్ మహీంద్రా బ్యాంకుకు రూ. 61.4 లక్షల జరిమానా విధించింది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌: కేవైసీ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుకు.. ఆర్‌బీఐ రూ. 38.6 లక్షల జరిమానా విధించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్: కస్టమర్ సర్వీస్ నిబంధనలను పాటించడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా విఫలమైంది. ఈ కారణంగా ఆర్‌బీఐ రూ. 29.6 లక్షల జరిమానా విధించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులకు జరిమానాలు విధించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా బ్యాంకులకు భారీ మొత్తంలో జరిమానాలు విధించింది. నియమాలను అనుసరించడంలో.. బ్యాంకులు విఫలమైతే ఆర్‌బీఐ జరిమానా విధించడానికి సిద్ధంగా ఉంటుంది.

ఇదీ చదవండి: 'ఇన్ఫోసిస్‌లో 20వేల ఉద్యోగాలు': క్లారిటీ ఇచ్చిన సీఎఫ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement