పాక్‌ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు | Petrol And Diesel Prices Crisis Hit Pakistan Cross Rs 300 Mark For The First Time In Nation's History - Sakshi
Sakshi News home page

Pakistan Petrol And Diesel Prices: రూ. 300 దాటేసిన పెట్రోలు

Sep 1 2023 11:11 AM | Updated on Sep 1 2023 11:41 AM

Petrol Diesel Prices Crisis Hit Pakistan Cross rs 300 Mark - Sakshi

Petrol Diesel Prices దేశ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి  చేరాయి. దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభం లోకి  కూరుకుపోతున్న ప్రస్తుత  తరుణంలో అక్కడ ఇంధన ధరలు రూ. 300 మార్కును దాటాయి. దీంతో ఇప్పటికే  ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశ ‍ ప్రజలు మరింత సంక్షోభంలోకి కూరుకు పోనున్నారని  ఆర్థికవేత్తలు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.

పాక్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంధన ధరలను పెంచేసింది. పెట్రోల్‌ ధరను 14.91, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరను 18.44 పెంచినట్లు గురువారం సాయంత్రం ప్రకటించింది. దీంతో అక్కడ ప్రస్తుతం పెట్రోల్ ధర305.36 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరుకుంది. ఇటీవలి ఆర్థిక సంస్కరణలతో పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం ఆల్‌ టైం హైకి చేరింది. ఫలితంగా పాకిస్థానీ రూపాయి కూడా దిగ జారి పోతుండటంతో  సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను కూడా భారీగా పెంచేసింది. డాలరు మారకంలో పాక్‌ కరెన్సీ  305.6 వద్దకు  చేరింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement