సెబీ మాజీ చీఫ్‌ మాధవికి క్లీన్‌ చిట్‌ | Lokpals Clean Chit To Ex SEBI Chief Madhabi Buch | Sakshi
Sakshi News home page

సెబీ మాజీ చీఫ్‌ మాధవికి క్లీన్‌ చిట్‌

May 29 2025 7:50 AM | Updated on May 29 2025 8:00 AM

Lokpals Clean Chit To Ex SEBI Chief Madhabi Buch

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ విషయంలో అనైతికంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ మాజీ చీఫ్‌ మాధవి పురి బచ్‌కు లోక్‌పాల్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆమెపై ఆరోపణలన్నీ ఊహాగానాలు, అభిప్రాయాలతో కూడుకున్నవేనని వ్యాఖ్యానించింది.

టీఎంసీ ఎంపీ మహువా మైత్రా సహా ఇతరుల ఫిర్యాదులన్నీ కూడా, అదానీ కంపెనీలను టార్గెట్‌ చేసుకుంటారని పేరొందిన ఓ షార్ట్‌సెల్లర్‌ నివేదిక ఆధారంగా చేసినవేనని పేర్కొంది. ఇవన్నీ నిరాధారమైనవేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఆదేశించడానికి ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. అదానీ గ్రూప్‌ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన నివేదికలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

వాటిపై సెబీ చైర్మన్‌ హోదాలో బచ్‌ విచారణ జరపాల్సినప్పటికీ.. అదానీ గ్రూప్‌ కుంభకోణంతో సంబంధమున్న ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌లో గతంలో ఆమెకి, ఆమె భర్తకి వాటాలు ఉన్నందున సరైన చర్యలు తీసుకోలేదంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపించింది. ఈ ప్రాతిపదికన దాఖలైన ఫిర్యాదులను లోక్‌పాల్‌ తాజాగా కొట్టివేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement