Parimatch: Legalising Betting In India With Proper Legal infra create Revenue And Jobs - Sakshi
Sakshi News home page

ఇది నిజమా? జూదాన్ని చట్టబద్ధం చేస్తే భారీ ఆదాయం!

Dec 18 2021 11:34 AM | Updated on Dec 18 2021 1:39 PM

Legalising Betting In India With Proper Legal infra create Revenue And Jobs: Parimatch - Sakshi

దుబాయ్‌: భారత్‌లో జూదాన్ని (పందేలు/బెట్టింగ్‌) చట్టబద్ధం చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయ రావడమే కాకుండా, ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయని పరిమ్యాచ్‌ ఇంటర్నేషనల్‌ (పీఎంఐ) అభిప్రాయం వ్యక్తం చేసింది. బెట్టింగ్‌ ఆపరేటర్ల నియంత్రణకు కార్యాచరణ అవసరమని పేర్కొంది.

అంతర్జాతీయంగా బెట్టింగ్‌ ఆపరేటర్లకు కావాల్సిన నైపుణ్య సేవలను పరిమ్యాచ్‌ ఇంటర్నేషనల్‌ అందిస్తుంటుంది. ఆన్‌లైన్‌ స్పోర్ట్స్‌ బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌ పరిమ్యాచ్‌ బ్రాండ్‌పై హక్కులు ఈ సంస్థకే ఉన్నాయి. ‘‘భారత ఆర్థిక వ్యవస్థకు బెట్టింగ్‌ గేమ్‌లూ ఊతమిస్తాయని మేము భావిస్తున్నాం. భారత్‌లో జూదాన్ని చట్టబద్ధం చేస్తే మెదటగా సమర్థించేది మేమే’’అని పీఎంఐ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ దిమిత్రి బెలియనిన్‌ పేర్కొన్నారు. అధిక జనాభా కలిగిన భారత్‌లో దీర్ఘకాలంలో పెద్ద ఎత్తున పన్ను ఆదాయం సమకూరుతుందంటూ.. మోసపూరిత ఆపరేటర్లను కట్టడి చేసేందుకు సరైన రక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement