భారత్ ఫోర్జ్ లిమిటెడ్కు చెందిన రక్షణ రంగ అనుబంధ సంస్థ ‘కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్’ (కేఎస్ఎస్ఎల్), అంతర్జాతీయ రక్షణ సంస్థ ‘పారామౌంట్’తో కలిసి సరికొత్త నెక్ట్స్ – జనరేషన్ లైట్ ఆర్మర్డ్ మల్టీ–పర్పస్ వాహనం ‘సింహ 4x4’ ను మార్కెట్లోకి తెచ్చాయి.
నాటో ప్రమాణాలకు అనుగుణంగా సాయుధ దళాల ఆధునిక అవసరాలతో పాటు, అంతర్జాతీయ రక్షణ డిమాండ్లను తీర్చేలా ఈ వాహనాన్ని సరికొత్త డిజైన్తో రూపొందించారు. పట్టణ ప్రాంతాల్లో రక్షణ ఆపరేషన్లు, రోడ్లపై, కఠిన భూభాగాల్లో నిఘా పెట్టడానికి ఈ ‘సింహ 4x4’ అనుకూలంగా ఉంటుంది. దీనిలోని మోడ్యులర్ ఆర్కిటెక్చర్ కారణంగా అవసరానికి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు (అప్గ్రేడ్లు) చేసుకోవడం సులువవుతుంది.


