రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా? | Invest Rs 121 Per Day Get 27 Lakh Do You Know About LIC Kanyadan Policy | Sakshi
Sakshi News home page

రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?

Apr 23 2025 4:50 PM | Updated on Apr 23 2025 5:28 PM

Invest Rs 121 Per Day Get 27 Lakh Do You Know About LIC Kanyadan Policy

సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత పొదుపు చేయాలని అందరూ అనుకుంటారు. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాల మీద బహుశా కొందరికి అవగాహన ఉండకపోవచ్చు. మనదేశంలో ముఖ్యంగా.. ఆడపిల్లల గురించి ఆలోచించేవారి సంఖ్య కొంత ఎక్కువే. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఆలోచించేవారు ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ఎంచుకోవచ్చు. ఇందులో రోజుకు రూ. 121 పొదుపు చేస్తే.. పెళ్లి చేసే నాటికి రూ. 27 లక్షలు చేతికి వస్తాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రవేశపెట్టిన 'ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ'.. తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో మీరు రోజుకు 121 రూపాయలు డిపాజిట్ చేస్తే.. నిర్దిష్ట సమయం తరువాత రూ. 27 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చేతికి అందుతాయి. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు, వచ్చే బోనస్ ఎంత అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

➤కనీస రోజువారీ పెట్టుబడి: రూ. 121
➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 27 లక్షల వరకు (ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు & బోనస్‌ ఆధారంగా)
➤పాలసీ కాలపరిమితి: 13 నుంచి 25 సంవత్సరాలు

ఇదీ చదవండి: ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?

ఉదాహరణకు.. మీ కుమార్తెకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మీరు రోజుకు రూ. 121 పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం. అలా మీరు 25 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే.. వచ్చే ఎల్ఐసీ ద్వారా బోనస్‌లు, లాయల్టీ వంటి వాటితో కలిపి మీ మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ. 27 లక్షలు దాటవచ్చు. ఈ పథకంలో లబ్ధిదారు తండ్రి వయస్సు కనీసం 30 సంవత్సరాలు, కుమార్తె వయస్సు కనీసం ఒక సంవత్సరం ఉండాలి.

ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?

ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ అనేది ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కిందికి వస్తుంది. కాబట్టి వినియోగదారులు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పాలసీదారు స్కీమ్ మెచ్యూరిటీ కాలానికి ముందే కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల మరణిస్తే.. కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల వరకు అందుతాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ప్రీమియం గడువు ముగిసిన తరువాత మొత్తం రూ. 27 లక్షలు నామినికీ అందిస్తారు.

ఎల్ఐసీ కన్యాదాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి.. ఐడెంటిటీ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ఋజువు, కుమార్తె బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటివి అవసమవుతాయి. ఈ పథకం గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సందర్శించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement