ఐఐటీ బాంబేకి పూర్వ విద్యార్థుల భారీ విరాళం | IIT Bombay alumni gift Rs 57 crore to institute | Sakshi
Sakshi News home page

ఐఐటీ బాంబేకి పూర్వ విద్యార్థుల భారీ విరాళం

Dec 25 2023 5:10 AM | Updated on Dec 25 2023 5:10 AM

IIT Bombay alumni gift Rs 57 crore to institute - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బాంబే)కి పూర్వ విద్యార్థులు భారీగా విరాళం అందించారు. 1998 బ్యాచ్‌కి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు రూ. 57 కోట్లు ప్రకటించారు. గోల్డెన్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా 1971 బ్యాచ్‌ విద్యార్థులు ఇచ్చిన రూ. 41 కోట్లకన్నా ఇది అధికం కావడం గమనార్హం.

ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం సిల్వర్‌ లేక్‌ ఎండీ అపూర్వ్‌ సక్సేనా, పీక్‌ ఫిఫ్టీన్‌ ఎండీ శైలేంద్ర సింగ్, గ్రేట్‌ లెరి్నంగ్‌ సీఈవో మోహన్‌ లక్కంరాజు, వెక్టర్‌ క్యాపిటల్‌ ఎండీ అనుపమ్‌ బెనర్జీ తదితరుల 1998 బ్యాచ్‌లో ఉన్నారు. ఈ నిధులు సంస్థ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు దోహదపడగలవని ఐఐటీ బాంబే డైరెక్టర్‌ శుభాశీస్‌ చౌదరి తెలిపారు. అలాగే 2030 నాటికల్లా ప్రపంచంలోనే టాప్‌ 50 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోవాలన్న లక్ష్య సాకారానికి కూడా తోడ్పడగలదని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement