రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ తాజాగా దేశవ్యాప్తంగా మరో 100 నగరాల్లో తమ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలోని 10 నగరాల్లో సర్వీసులు విస్తరించినట్లు సంస్థ తెలిపింది.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ విస్తరణలో భాగంగా కొత్త ప్రయాణికులకు పరిమిత కాలం పాటు మొదటి రైడ్ను ఉచితంగా అందిస్తున్నట్లు వివరించింది. దేశీయంగా 225 నగరాల మార్కును దాటడం ద్వారా మరింత మంది ప్రయాణికులకు సర్వీసులను విస్తరించినట్లయిందని ఉబర్ ఇండియా డైరెక్టర్ రిషాంత్ ఘోష్ చెప్పారు.


