హిందుస్తాన్‌ జింక్‌ విభజనకు కేంద్రం నో... | Government rejects Hindustan Zinc plan to split company | Sakshi
Sakshi News home page

హిందుస్తాన్‌ జింక్‌ విభజనకు కేంద్రం నో...

Mar 23 2024 5:40 AM | Updated on Mar 23 2024 5:40 AM

Government rejects Hindustan Zinc plan to split company - Sakshi

న్యూఢిల్లీ: ప్రమోటర్‌ గ్రూప్‌.. వేదాంతా ప్రతిపాదిత హిందుస్తాన్‌ జింక్‌ కంపెనీ విభజనకు గనుల శాఖ నో చెప్పింది. హిందుస్తాన్‌ జింక్‌ను రెండు విభిన్న సంస్థలుగా విడదీసేందుకు వేదాంతా గ్రూప్‌ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు మైన్స్‌ సెక్రటరీ వీఎల్‌ కాంతారావు తాజాగా వెల్లడించారు. వాటాదారుగా కంపెనీ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదని తెలియజేశారు. వెరసి విభజన ప్రతిపాదనను అంగీకరించలేదని స్పష్టం చేశారు. కంపెనీలో ప్రభుత్వం 29.54 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)ను పెంచుకునే బాటలో జింక్, సిల్వర్‌సహా బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు హిందుస్తాన్‌ జింక్‌ ఇంతక్రితం ప్రతిపాదించింది. కాగా.. బిజినెస్‌ల విభజనకు సలహాదారు సంస్థను నియమించుకునే యోచనలో ఉన్నట్లు గతంలో హిందుస్తాన్‌ జింక్‌ ప్రకటించింది. కంపెనీ విలువను మెరుగుపరచేందుకు కార్పొరేట్‌ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్‌ బిజినెస్‌లను రెండు చట్టబద్ధ కంపెనీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ఇంతక్రితం నియంత్రణ సంస్థలకు తెలియజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement