న్యూఢిల్లీ: ఇటీవల అమ్మకాల ఒత్తిడికి లోనైన బంగారం, వెండి ధరలు వారాంతపు రోజున పుంజుకున్నాయి. దిగివస్తున్న చమురు ధరలు ద్రవ్యోల్బణ ఆందోళనలను తగ్గించడంతో, ఇన్వెస్టర్లు తిరిగి బులియన్ వైపు మొగ్గు చూపారు. ఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రా. పసిడి ధర రూ.1,600 పెరిగి రూ.1,56,600కి చేరింది.
కిలో వెండి ధర రూ.5,000 ఎగసి రూ.2.47 లక్షల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 1.17% పెరిగి 4,392.78 డాలర్లకు చేరింది. యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంచినప్పటికీ, క్రూడ్ ధరలు దిగిరావడంతో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయని బులియన్ నిపుణులు తెలిపారు.


