బాలీవుడ్ జంట దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ దంపతులు తమ రెండో బిడ్డను త్వరలోనే ఆహ్వానించనున్న తరుణంలో, భగవంతుని ఆశీస్సులు పొందేందుకు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. రణ్వీర్ తల్లిదండ్రులతో కలిసి ఈ సెలబ్రిటీ దంపతులు సందడి చేశారు.
ముంబైలోని ప్రసిద్ధ 'లాల్బాగ్చా రాజా'ను దర్శించుకుని బాప్పా ఆశీస్సులు తీసుకున్న ఒక రోజు తర్వాత, తాజాగా సిద్దివినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా దీపికా పదుకొనే ఆరెంజ్, పర్పుల్ రంగుల కుర్తా సెట్లో కనిపించగా, రణ్వీర్ సింగ్ పర్పుల్ కుర్తా , వైట్ ట్రౌజర్స్ ధరించారు.సరిగ్గా రెండేళ్ల క్రితం తమ మొదటి కూతురు దువా పుట్టడానికి రెండు రోజుల ముందు (సెప్టెంబర్ 6, 2024న) కూడా ఈ దంపతులు సిద్ధవినాాయక ఆలయాన్ని సందర్శించడం విశేషం.ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు రణ్వీర్. పింక్ కుర్తా ధరించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ify"> దీపికా-రణ్వీర్ దంపతులు ఆలయంలోకి ప్రవేశించే సమయంలో దీపికా రణ్వీర్ చేయి పట్టుకుని నడుస్తున్న వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. వీరిద్దరి సాదాసీదా, సంప్రదాయ రూపం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. తమ కూతురు దువా రెండవ పుట్టినరోజు (సెప్టెంబర్ 8) సందర్భంగా కుటుంబానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
>

ఇదీ చదవండి: సీఎం సువెందు దెబ్బ : మమతకు ఒకే రోజు రెండు షాకులు
ఈ ఏడాది ఏప్రిల్ 19న తాము రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు దీపికా, రణ్వీర్ సంయుక్తంగా ఇన్స్టాగ్రామ్లో ప్రకటించారు. తమ కూతురు దువా పాజిటివ్ ప్రెగ్నెన్సీ కిట్ను పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పారు.
దీపికా - రణ్వీర్
2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో దీపికా-రణ్వీర్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం కొంకణి, సింధీ సంప్రదాయాల ప్రకారం రెండు పద్ధతుల్లో జరిగింది. సెప్టెంబర్ 8, 2024న వీరు తమ తొలి సంతానం దువాను స్వాగతించారు.
ఇదీ చదవండి: ఐఫోన్ క్రేజ్ : భార్యామణి కోసం ఏకంగా గోల్డ్ అమ్మి మరీ!


