సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ పాలనలో రెడ్ బుక్ అరాచకం ఏపీ సరిహద్దులు దాటింది. ఏకంగా జాతీయ స్థాయి జర్నలిస్టులకూ రెడ్బుక్ ఆగడాలు తప్పడం లేదు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు ధన్య రాజేంద్రన్ వరకూ రెడ్బుక్ వేధింపులు వెళ్తడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
పలు వార్తలు, వీడియోలకు సంబంధించి ఆమె పోస్టులను తొలగించాలంటూ ఎఫ్బీఐ పేరుతో ఎక్స్కు ఏపీ పోలీసుల ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసుల తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, గుంటూరులో ఎఫ్బీఐ ఎప్పుడు పెట్టారంటూ ప్రముఖుల విమర్శలు కురిపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై పీవీ రమేష్ సహా పలువురు రిటైర్డ్ ఆఫీసర్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Hi @APPOLICE100. Is this your job? To send takedown requests on stories? That too about some low-level TDP guy. Shame. Use your time to actually help people instead https://t.co/7KlsfzhUi3 pic.twitter.com/ZxT5vq0gGY
— Dhanya Rajendran (@dhanyarajendran) September 17, 2026
Also please note that the Andhra cop has claimed to be FBI https://t.co/8XjBY2R9Jj
— Dhanya Rajendran (@dhanyarajendran) September 17, 2026

ఇదీ చదవండి: కరువు ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్ జగన్


