భూటాన్ ప్రభుత్వానికి 54 కార్లు! | Union Minister S Jaishankar Hands Over Mahindra XEV 9e EVs To Bhutan Government | Sakshi
Sakshi News home page

భూటాన్ ప్రభుత్వానికి 54 కార్లు: జైశంకర్ ట్వీట్

Sep 18 2026 9:20 PM | Updated on Sep 18 2026 9:21 PM

Union Minister S Jaishankar Hands Over Mahindra XEV 9e EVs To Bhutan Government

భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్.. థింఫులో భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గేకు 54 మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e) ఎలక్ట్రిక్ కార్లను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

జైశంకర్ రెండు రోజుల భూటాన్ పర్యటన సందర్భంగా.. ఈ వాహనాలను అప్పగించారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి, ఇతర సీనియర్ నాయకులతో ఇంధనం, కనెక్టివిటీ.. విస్తృత ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. 54 ఎలక్ట్రిక్ వాహనాలను అప్పగించడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని, ఈ-మొబిలిటీ.. సుస్థిర రవాణా రంగాలలో భూటాన్ సాధిస్తున్న పురోగతికి భారతదేశం మద్దతు ఇస్తోందని డాక్టర్ జైశంకర్ సోషల్ మీడియాలో తెలిపారు.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ
ఎక్స్ఈవీ 9ఈ అనేది మహీంద్రా కంపెనీకి చెందిన ప్రత్యేకమైన INGLO ఆర్కిటెక్చర్‌పై నిర్మితమయ్యాయి. ఇది ప్రత్యేకంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్ల కోసం రూపొందించిన టెక్నాలజీ. ప్యాక్ టూ వేరియంట్ 59 కిలోవాట్ LFP బ్యాటరీ ప్యాక్‌ను.. వెనుక యాక్సిల్‌పై అమర్చిన ఒకే ఒక పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను ఉపయోగిస్తుంది. ఇది దీనిని రియర్ వీల్ డ్రైవ్ SUVగా చేస్తుంది.

ఈ మోటార్ 228 bhp పవర్, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. రేంజ్ విషయానికి వస్తే.. 59 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ 542 కిమీ రేంజ్ అందిస్తుంది. ఎక్స్ఈవీ 9ఈ 140 kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, అనుకూల పరిస్థితులలో బ్యాటరీ సుమారు 20 నిమిషాల్లో 20 శాతం నుండి 80 శాతానికి ఛార్జ్ అవ్వగలదు. AC ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర భారతదేశంలో రూ. 21.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement