
బంగారం ధరలు బ్రేకుల్లేని బండిలా.. దూసుకెల్తూనే ఉంది. ఆదివారం స్థిరంగా ఉన్న పసిడి ధరలు మళ్ళీ పెరుగుదల దిశగా సాగాయి. దీంతో నేడు (ఫిబ్రవరి 24) గోల్డ్ రేటు మళ్ళీ పెరిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,870 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 100 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.
చైన్నైలో కూడా బంగారం ధరలు రూ. 100 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,870 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ప్రధాన కారణాలివే..
దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,690 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 88,020 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 90, రూ. 100 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.
వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరుగుదల వైపు అడుగులు వేసాయి. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 24) కేజీ సిల్వర్ రేటు రూ. 1000 పెరిగి, రూ. 1,08,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,01,000 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).