ఎన్‌పీఎస్‌ వాత్సల్యకూ పన్ను ఊరట  | Budget offers income tax benefits to subscribers of NPS Vatsalya scheme | Sakshi
Sakshi News home page

ఎన్‌పీఎస్‌ వాత్సల్యకూ పన్ను ఊరట 

Feb 2 2025 5:01 AM | Updated on Feb 2 2025 7:15 AM

Budget offers income tax benefits to subscribers of NPS Vatsalya scheme

రూ.50,000 పెట్టుబడికి మినహాయింపు

పాత విధానానికే పరిమితం

న్యూఢిల్లీ: చిన్నారుల రిటైర్మెంట్‌కు గణనీయమైన నిధిని సమకూర్చుకునే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన పీఎం వాత్సల్య ఎన్‌పీఎస్‌ పథకానికి తాజా బడ్జెట్‌లో రూ.50,000 పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కల్పించారు. తొలిసారిగా 2024–25 బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతా ప్రారంభించి ఇన్వెస్ట్‌ చేయవచ్చు. చిన్నారులు 18 ఏళ్లు నిండిన తర్వాత రెగ్యులర్‌ ఖాతా కింద మార్చుకుని, అప్పుడు వారు స్వయంగా ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి  వెసులుబాటు ఉంది.

 దీని కింద ఇప్పటికే 89,475 ఖాతాలు ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో రూ.62 కోట్ల పెట్టుబడులు సైతం సమకూరాయి. ఈ పథకానికి మరింత ఆదరణ కల్పించే ఉద్దేశ్యంతో తాజాగా పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఆర్థిక మంత్రి  కల్పించారు. సాధారణ ఎన్‌పీఎస్‌ ఖాతాకు ఉన్నట్టుగానే ఎన్‌పీఎస్‌ వాత్సల్యకు ఒకే విధమైన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. కాకపోతే చట్టం పరిధిలో ప్రస్తుతమున్న గరిష్ట ప్రయోజనాల పరిధిలోనే ఇది ఉంటుందన్నారు. సెక్షన్‌ 80 సీసీడీ(1బి) కింద సాధారణ ఎన్‌పీఎస్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల జమలపై పన్ను మినహాయింపు ప్రయోజనం ప్రస్తుతం పాత పన్ను విధానం కింద అమల్లో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement