వీడియో వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ.. | Anil Ambani Ready To Record Testimony Virtually After ED Summons In FEMA Case, More Details | Sakshi
Sakshi News home page

Anil Ambani: వీడియో వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ..

Nov 17 2025 8:41 PM | Updated on Nov 17 2025 9:13 PM

Anil Ambani offered make himself ED via virtual appearance or recorded video

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ తన వాంగ్మూలాన్ని వర్చువల్ విధానంలో నమోదు చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ)కు అందుబాటులో ఉంచడానికి సిద్ధమని చెప్పారు. ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్) కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

వర్చువల్ విధానంలో హాజరు

అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి మాత్రమే ఈడీ సమన్లు జారీ చేసిందని ఆయన అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వర్చువల్ విధానం లేదా రికార్డ్ చేసిన వీడియో ద్వారా ఈడీకి తగిన తేదీ, సమయానికి తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు అనిల్‌ అంబానీ అందుబాటులో ఉంటారని తెలిపారు.

కేసు నేపథ్యం

  • జైపూర్-రీంగస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన ఫెమా కేసులో అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది.

  • రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ రహదారి నిర్మాణానికి ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) కాంట్రాక్టును ఇచ్చింది.

  • ఈ రోడ్డు ప్రస్తుతం గత నాలుగేళ్లుగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్వహణలో ఉంది.

ఈడీ అధికారుల తరఫున అనిల్ అంబానీ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ కేసు 15 ఏళ్ల నాటిదని, 2010లో జరిగిన రోడ్డు కాంట్రాక్టర్‌కు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఇది పూర్తిగా దేశీయ ఒప్పందం, ఇందులో విదేశీ లావాదేవీలు లేవని ఆ ప్రకటనలో వివరించారు. అనిల్ అంబానీ ఏప్రిల్ 2007 నుంచి మార్చి 2022 వరకు అంటే దాదాపు 15 ఏళ్ల పాటు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇదీ చదవండి: ఉదయం 5 గంటలకు ఈమెయిల్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement