సైలెంట్‌గా వచ్చిన కొత్త రీచార్జ్‌ ప్లాన్‌! అధిక వ్యాలిడిటీతో.. | Airtel Launched Rs 279 Prepaid Plan With Extended Validity | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా వచ్చిన కొత్త రీచార్జ్‌ ప్లాన్‌! అధిక వ్యాలిడిటీతో..

Jun 19 2024 7:00 PM | Updated on Jun 19 2024 7:27 PM

Airtel launched Rs 279 prepaid plan with extended validity

అధిక వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాలింగ్ తో ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. రూ.279 విలువైన ఈ ప్లాన్ ను సైలెంట్‌గా వెబ్‌సైట్‌లో చేర్చేసింది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునేవారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ రీచార్జ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

సాధారణంగా చాలా రీచార్జ్‌ ప్లాన్లు 28 లేదా 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటాయి. కానీ రూ .279 ప్లాన్ 45 రోజుల వాలిడిటీతో వస్తుంది. కాబట్టి, 15 రోజులు చెల్లుబాటు అదనంగా లభిస్తుంది. అధిక వ్యాలిడిటీ మాత్రమే కాకుండా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, లోకల్, ఎస్‌టీడీ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.

ఇక అధిక వ్యాలిడిటీ ఉన్న ఇతర ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే రూ .279 ప్లాన్ కూడా చాలా తక్కువ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ 2 జీబీ డేటాను మాత్రమే అందిస్తుంది. ఎక్కువ డేటాను పొందాలనుకుంటే, ప్రత్యేక డేటా వోచర్లలో రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జియో తన చాలా ప్లాన్లతో ఇచ్చినట్లుగా ఇందులో ఉచిత అపరిమిత 5జీ ఆప్షన్ లేదు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు మొత్తం 600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement