మహిళపై పొట్టేలు దాడి | - | Sakshi
Sakshi News home page

మహిళపై పొట్టేలు దాడి

Aug 11 2026 12:36 AM | Updated on Aug 11 2026 12:36 AM

నిమ్మనపల్లి (మదనపల్లె టౌన్‌) : గొర్రెల మందలోని ఓ పొట్టేలు దాడి చేయడంతో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ఉదయం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. వివరాలు.. నిమ్మనపల్లె మండలం, చలిమామిడికి చెందిన రాజన్న గొర్రెలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య ఎల్లమ్మ (45) చెత్త ఊడ్చేందుకు గొర్రెల మంద వద్దకు వెళ్లింది. ఈ సమయంలో అక్కడ ఉన్న ఓ పొట్టేలు ఒక్కసారిగా ఆమైపె దాడి చేసింది. ఈ దాడిలో ఎల్లమ్మ తుంటి ఎముక విరిగి తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు 108 అంబులెనన్స్‌లో బాధితురాలిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎల్లమ్మకు ప్రథమ చికిత్సలు అందించి, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement