జిల్లాలో తాగునీటి సంక్షోభం ఏప్రిల్ నుంచే మొదలైంది. ప్రస్తుతం 71 పల్లెల్లో పరిస్థితి తీవ్రంగా మారడంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ట్యాంకర్లు, ప్రైవేట్ బోర్ల టైఅప్ ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ మండలాల్లోని మరో 32 పల్లెల్లో నీటి సమస్య వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ జల సంక్షోభ ప్రభావం రాయచోటి నియోజకవర్గంపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ భూగర్భజల మట్టం కొంత ఊరటనిచ్చినా, భౌగోళిక పరిస్థితుల వల్ల తాగునీటి సమస్యలు ఇక్కడే అధికంగా ఉన్నాయి. ఆగస్టులోనూ వర్షాలు కురవకపోతే జిల్లావ్యాప్తంగా సాగు, తాగునీటి రంగాలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.


