సాక్షి,న్యూఢిల్లీ: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్, అలాగే లాకప్ డెత్కు (అదృశ్యం) గురైన గాదె సాయికృష్ణ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) ఛైర్మన్ను కలిశారు. ఈ రెండు ఘటనలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిల తనూజరాణి, డాక్టర్ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సాయికృష్ణ లాకప్డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్యల వెనుక ఉన్న నిజాలను బయటకు తీసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు.


