వైఎస్‌ జగన్‌ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు | Teachers Union Leaders Meet Ys Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు

Jul 7 2026 2:18 PM | Updated on Jul 7 2026 2:51 PM

Teachers Union Leaders Meet Ys Jagan

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇవాళ ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై వైఎస్‌ జగన్‌కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధన సరికాదని వైఎస్ జగన్‌కు ఉపాధ్యాయులు వివరించారు.

బీఈడీతో ఉద్యోగం పొందిన 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెట్‌ రాయాలనడం సరికాదని ఉపాధ్యాయులు అన్నారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారని  హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌.. సమస్యను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement