తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం | TDP leaders cheated 350 people in the name of jobs | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం

Mar 1 2025 3:23 AM | Updated on Mar 1 2025 3:23 AM

TDP leaders cheated 350 people in the name of jobs

ఉద్యోగాల పేరిట 350 మందిని మోసం చేసిన టీడీపీ నేతలు

రూ.6 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన శ్రీకాకుళానికి చెందిన ధర్మారావురెడ్డి

మధ్యవర్తిగా వ్యవహరించిన మరో తెలుగు తమ్ముడు దిలీప్‌

రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మోసానికి బీజం 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

విశాఖపట్నం పోలీస్‌ కమిషనరేట్‌లోనూ అదే తీరు

సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యం  

సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం కేంద్రంగా మొదలై.. హైదరా­బాద్‌ వరకు ఇద్దరు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చిoది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట 350 మందికి టోకరా వేసి సుమారు రూ.6 కోట్లతో పరారైన వైనం బయటపడింది. ఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా చీకటి బ్లాక్‌ పార్వతీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొచ్చెర్ల ధర్మారావురెడ్డి పోలెండ్‌లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఏజెంట్‌గా అవతారం ఎత్తి స్థానిక యువకులకు ఉద్యోగాల ఎర వేశాడు. 

దగ్గర బంధువుల్లో నిరుద్యోగులుగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇటలీలో అదిరిపోయే ఉద్యోగాలున్నాయని ఊరించాడు. ధర్మారావురెడ్డి తన బంధువులైన ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కాయి దిలీప్‌(తేలుకుంచి), శ్రీను(బెజ్జిపద్ర)తో ప్రచారం ఊదరగొట్టించాడు. ఇటలీలో ఫ్రూట్స్‌ కటింగ్, ప్యాకింగ్, వైన్, బీర్ల కంపెనీలు, ప్యాకింగ్‌ మొదలైన సంస్థల్లో మంచి ఉద్యోగాలు, కష్టం లేని పని, రూ.లక్షల్లో జీతం అంటూ నమ్మించాడు. 

ఎంత వీలైతే అంతమందికి ఉద్యోగాలున్నాయని.. ఎక్కువ మందిని తీసుకొస్తే ఫీజులో కొంత తగ్గిస్తానంటూ ఆ­శ చూపించాడు. టీడీపీ నేతల మాట­లు న­మ్మిన నిరుద్యోగు­లు.. హైద­రాబాద్, విజయవాడ, వై­జాగ్, ప్రకాశం, గుంటూరు త­ది­తర ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న బంధువులు, స్నేహితులను సంప్రదించారు. వారిని కూడా ఈ ఉచ్చులోకి తీసుకొచ్చారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాకే.. 
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ధర్మారావురెడ్డి, దిలీప్‌ కలిసి ప్లాన్‌ వేసినట్లు పక్కాగా స్పష్టమవుతోంది. ఇచ్ఛాపురం ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధం.. ఏం జరిగినా పార్టీ కాపాడుతుందన్న తెగింపుతో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 350 మందిని ఎంపిక చేశారు. ఇచ్చాç­³#రంలో లాడ్జిని తీసుకొని మొదటి విడతలో 2024 ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.20 వేలు అడ్వాన్స్, తర్వాత రూ.1.35 లక్షలు వసూలు చేశారు.  

ఆగస్టులో హైదరాబాద్‌లో మరో 175 మందిని ఇంటర్వ్యూ చేసి   రూ.1.35 లక్షలు చొప్పున తీసుకున్నారు. జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి రూ.50 వేలు వంతున వసూలు చేశారు. అందరి దగ్గర విద్యార్హతల ధ్రువ­ప­త్రాల జిరాక్స్‌లు, ఫొటోలు తీసుకున్నారు. ఫిబ్ర­వరి లేదా మార్చి మొదటి వారంలో ఇటలీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు.  

మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారని చెప్పి ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ ల్యాబ్‌లో 350 మంది నిరుద్యోగులకు వారి సొంత డబ్బు తోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. 

ఢిల్లీ వెళ్లాక బట్టబయలైన మోసం
ఇటలీ ప్రయాణానికి మొదటి విడతలో 30 మంది పాస్‌పోర్టు చెకింగ్, స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని ధర్మారావు, దిలీప్‌ రెండు వారాల క్రితం చెప్పడంతో.. ఢిల్లీ వెళ్లిన యువకులకు అసలు విషయం  తెలిసింది.  వాళ్లు చెప్పిన అడ్రస్‌లు, పాస్‌పోర్టు చెకింగ్‌లు అంతా మోసమని గ్రహించారు. 350 మందితో ఒక వాట్సప్‌ గ్రూప్‌ పెట్టిన టీడీపీ నేతలు.. ’’మీతో పాటు మేము కూడా మోసపోయాం.. అందరూ క్షమించాలి‘‘ అంటూ వాయిస్‌ మెసేజ్‌ పెట్టి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేశారు. బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు. 

పోలీసుల్ని ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు.! 
ధర్మారావురెడ్డి బాధితులు ఫిబ్రవరి 17న ఇచ్ఛాపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పరిశీలిస్తామని చెప్పారు తప్ప.. విచారణకు సాహసించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి.. విచారణను ఆపుతున్నట్లు బాధితులు గ్రహించారు. చేసేదిలేక విశాఖపట్నం పోలీస్‌ కమిషనరేట్‌కు వచి్చనా పట్టించుకోలేదంటూ బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. రాజకీయ పలుకుబడితో.. కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

సీఎం కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం 
టీడీపీ నేతల బాధితులు 
ధర్మారెడ్డి మంచివాడు అని నమ్మబలికిన దిలీప్‌ మధ్యవర్తిత్వంతో అందరం డబ్బు చెల్లించాం. మోసపోయామని చివరి నిమిషంలో తెలిసింది. దిలీప్‌ను నిలదీసినా స్పందించలేదు. ఇచ్ఛాపురం పోలీసులు పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్‌కు వెళ్లాం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లారని  చెప్పడంతో.. సీఎం కార్యాలయంలోనూ, మంత్రి లోకేష్‌ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం. 

మా ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడును కలిసి ఫిర్యాదు చేస్తే.. రెండు రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పారు. వారం దాటినా ఎలాంటి స్పందన లేదు. చాలామంది ఉన్న ఉద్యోగం వదిలి డబ్బులు కట్టాం. రోడ్డున పడ్డాం. డబ్బు తిరిగి చెల్లించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement