తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్‌ | Subramanian Swamy Is Serious About Tirumala Goshala Incident | Sakshi
Sakshi News home page

తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్‌

Apr 12 2025 4:41 PM | Updated on Apr 12 2025 6:06 PM

Subramanian Swamy Is Serious About Tirumala Goshala Incident

సాక్షి, తిరుపతి: తిరుమల గోశాలలో గోవుల మృతి ఘటనపై మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల వ్యవధిలో పలు గోవులు చనిపోవడం తీవ్రంగా కలిచివేసిందని ఎక్స్‌ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గోవుల మృతి  విషయం టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ద్వారా తెలిసింది. దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నా.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తాను’’ అని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్‌ చేశారు.

టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవుల మృతిపై  వైఎస్సార్‌­సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్య­క్షుడు, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నిన్న(శుక్రవారం) సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘టీటీడీ గోశాలలో దేశవాలి అవులు వందకు పైగా మృత్యువాత పడ్డాయి. నిర్వాహకులు ఈ విషయం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆవులు ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించలేదు. డీఎఫ్‌ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్‌ చార్జిగా నియమించారు. ఆయనకు గోపరిరక్షణకు ఎటువంటి సంబంధం లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలి’ అని డిమాండ్‌ చేశారు.

తిరుమల గోశాల ఘటనపై సుబ్రమణ్య స్వామి సీరియస్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement