
తైక్వాండోలో బంగారు పతకం
సొంతం చేసుకున్న తొమ్మిదేళ్ల బాలిక
సాక్షి, అమరావతి: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బాలిక సోహన్వికారెడ్డి తైక్వాండో పోటీల్లో అదరగొట్టింది. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన సౌత్ జోన్ సబ్ జూనియర్స్ తైక్వాండో విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. తలుపుల మండలం గంజివారిపల్లెకు చెందిన గుణరంజన్రెడ్డి కుమార్తె సోహని్వకా రెడ్డి చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తిని కనబరుస్తోంది.