School Education Commissioner S.Sureshkumar Issued Several Instructions to All Schools Over Omicron - Sakshi
Sakshi News home page

ఆటలు వద్దు.. సూచనలు జారీ చేసిన విద్యాశాఖ కమిషనర్‌

Jan 25 2022 4:43 AM | Updated on Jan 25 2022 3:16 PM

School Education Department on wake of increase in Covid cases - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ పలు సూచనలు జారీ చేశారు. గతంలో జారీ చేసిన కోవిడ్‌ ప్రోటోకాల్‌ అంశాలను పాటిస్తూనే.. కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.

సంక్రాంతి సెలవుల అనంతరం శానిటైజ్‌ చేయించడం, మాస్కులు తప్పనిసరి చేయడం వంటి చర్యలతో స్కూళ్లను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో తొలిరోజే 65 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం 90 శాతానికి పైగా విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement