‘సాక్షి’కి ఆపాదించడం సరికాదు | Sakshi Statement On Journalist Krishnam Raju Comments On Amaravati: Ap | Sakshi
Sakshi News home page

‘సాక్షి’కి ఆపాదించడం సరికాదు

Jun 8 2025 5:32 AM | Updated on Jun 8 2025 5:32 AM

Sakshi Statement On Journalist Krishnam Raju Comments On Amaravati: Ap

విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం

ఆ వ్యాఖ్యలను సాక్షి మీడియా తీవ్రంగా ఖండిస్తోంది

సాక్షి మీడియాకు ఎల్లప్పుడూ మహిళలంటే గౌరవం

దీనికి కూటమి నేతలు రాజకీయ రంగు పులమడం తగదు

‘సాక్షి’ మీడియానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు దుష్ప్రచారం దారుణం

దీనిని వివాదంగా మార్చేందుకు టీడీపీ సోషల్‌ మీడియా ఎత్తుగడ

ఇది సరికాదని, విష సంస్కృతికి తెర తీయొద్దంటున్న జర్నలిస్టులు

సాక్షి, అమరావతి: సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్‌ఆర్‌ లైవ్‌ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ‘సాక్షి’ టీవీ స్పష్టం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను తనకు ఆపాదిస్తూ కూ­టమి నేతలు చేస్తున్న ప్రకటనలను సాక్షి టీవీ తీవ్రంగా ఖండించింది. తాము ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలను చూపుతామని తెలిపింది. సీనియర్‌ జర్నలిస్ట్‌ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ ఎంత మాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని వెల్లడించింది.

‘సాక్షి’ మొదటి నుంచీ కూడా మహిళల పట్ల అత్యంత గౌరవంగా వ్యవహరిస్తోంది. మహిళల వికాసానికి, వారి అభ్యున్నతికి సంబంధించి అనేక ప్రత్యేక కథనాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తోంది. పాత్రికేయ విలువలకు కట్టుబడి పని చేస్తున్న ‘సాక్షి’ ఏనాడు గీత దాటలేదు. పాత్రికేయ చట్టాలు, నిబంధనల పరిధిలో ప్రజలకు వాస్తవాలను వెల్లడిస్తోంది. దీంతో.. ‘సాక్షి’ని నేరుగా ఏమీచేయలేకపోతు­న్నామనే బాధలో ఉన్న టీడీపీ, దాని అనుబంధ ఎల్లో మీడి­యా, ‘సాక్షి’కి ఏమాత్రం సంబంధంలేని వ్యాఖ్యలను చూపించి కుట్రలకు తెర తీస్తుండటం దారుణం అని పలువురు సీనియర్‌ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్‌ఆర్‌ లైవ్‌ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని ‘సాక్షి’ టీవీ స్పష్టం చేసినప్పటికీ ఇంకా ఏదో రాద్ధాంతం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యలను ‘సాక్షి’కి ఆపాదిస్తూ, సంస్థ ప్రతిష్టను దిగజార్చే పన్నాగంతో టీడీపీ సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుండటం సరికాదంటున్నారు.  

దురుద్దేశంతో ‘సాక్షి’పై టీడీపీ కుట్రలు 
‘సాక్షి’ కార్యాలయాలపైకి తన మూకలను ఉసి­గొల్పి సంస్థను ఇబ్బంది పెట్టాలని టీడీపీ వ్యూహ రచన చేస్తుండటం సరికాదని, ఇది కొత్త విష సంస్కృతికి దారి తీస్తుందని సీనియర్‌ జర్నలిస్టులు హెచ్చ­రిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభు­త్వం కొలువుదీరి ఏడా­దైనా, ఫలానా మంచి పనులు చేశామని చెప్పుకునేందుకు ఏమీ లేక సతమతమ­వు­తోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుండటంతో ఎలాగైనా దాన్ని డైవర్ట్‌ చేసేందుకు ఎప్పటి లాగే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపింది.

ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం విజయవాడ ‘సాక్షి’ కార్యాలయం వద్దకు కొంత మందిని పంపించి గొడవ చేయించింది. ‘సాక్షి’కి మహిళలంటే గౌరవ­మని, కృష్ణంరాజు వ్యాఖ్యలను ఎంత మాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని పోలీసుల సమక్షంలో వారికి స్పష్టం చేయడంతో ఆందోళన విరమించి వెళ్లిపోయారు. అయినా కూడా శనివారం రాత్రి పొద్దుపోయాక కూడా టీడీపీ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం కొనసాగింది. పైగా ఆదివారం రాష్ట్రంలోని అన్ని ‘సాక్షి’ కార్యాలయాల వద్ద ఆందోళనలకు సన్నాహాలకు పిలుపునిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంత మాత్రం సరికాదని సీనియర్‌ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement