నేడు అమరావతికి ప్రధాని మోదీ | Prime Minister Modi to visit Amaravati today | Sakshi
Sakshi News home page

నేడు అమరావతికి ప్రధాని మోదీ

May 2 2025 4:57 AM | Updated on May 2 2025 10:45 AM

Prime Minister Modi to visit Amaravati today

అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని 

అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగం 

6,000 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు 

సభ కోసం 5 లక్షల మంది సమీకరణ..  

4,500 బస్సులు కేటాయింపు  

సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాలొ­్గ­ంటారు. ఇందుకోసం శుక్రవారం మధ్యా­హ్నం 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడిలోని సభా ప్రాంగణానికి వెళ్తారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొని.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయ­­ంత్రం 4.55 గంటలకు గన్న­వరం చేరుకొని.. తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. 

భారీ భద్రత.. 
ప్రధాని పర్యటనకు పోలీ­సు­లు భారీ భద్రతా ఏర్పా­ట్లు చేస్తున్నారు. 6 వేల మందికి పైగా పోలీస్‌ బలగా­లను మోహ­రించారు. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్‌ అధికారులను నియమించారు. అమరావతి­లోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గా­ల­ను ఖరారు చేశారు. వాటిలో రెండు మార్గాలను ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలను ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఆ«దీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులకు అప్పగించింది. జన సమీకరణ కోసం 4,500 ఆర్టీసీ బస్సులను కేటాయించింది.  

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షలు.. 
ప్రధాని పర్యటన సందర్భంగా శుక్రవారం ఉద­యం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుంటూరు వరకు వాహనాలను జాతీయ రహదారిపై అనుమతించరు. కాగా, ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంత్రులు పయ్యావుల కేశవ్, పి.నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గురువారం సభా ప్రాంగణంలోని ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. 

వారు మీడియాతో మాట్లాడుతూ.. జనంతో వచ్చే ప్రతి బస్సుకు ఒక ప్రభుత్వ అధికారిని ఇన్‌చార్జిగా పెట్టినట్లు తెలిపారు. ప్రతి 25 బస్సులకు ఒక అధికారిని ప్రత్యేక ఇన్‌చార్జిగా నియమించామన్నారు. ప్రజలకు బస్సుల్లో అల్పాహారం, తాగునీరు, మధ్యాహ్న భోజనం, సభా ప్రాంగణం వద్ద రాత్రి భోజనం అందించనున్నట్లు చెప్పారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా, ప్రధాని పర్యటన ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కె.విజయానంద్‌ పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement