విజయవాడ దుర్గగుడిలో శుక్రవారం రాత్రి విద్యుత్ అంతరాయం నెలకొనడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 45 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డీజిల్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ కాలేదు. భక్తులకు ఎదురైన ఇబ్బందులపై అధికారులు పట్టించుకోలేదు. 45 నిమిషాల తర్వాత కరెంట్ రావడంతో భక్తులకు ఉపశమనం కలిగింది.


