చంద్రబాబు,పవన్‌,లోకేష్‌ కనుసన్నల్లోనే.. కొమ్మినేని అరెస్ట్‌ ముందు జరిగిన కుట్ర | Nara Lokesh Behind On Kommineni Srinivasa Rao Arrest | Sakshi
Sakshi News home page

Kommineni Srinivasa Rao: చంద్రబాబు,పవన్‌,లోకేష్‌ కనుసన్నల్లోనే.. కొమ్మినేని అరెస్ట్‌ ముందు జరిగిన కుట్ర

Jun 9 2025 12:49 PM | Updated on Jun 9 2025 2:12 PM

Nara Lokesh Behind On Kommineni Srinivasa Rao Arrest

సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్‌ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు అనంతపురంలో టీడీపీ కార్యకర్తల గ్యాంగ్‌ రేప్‌, ఇంటర్‌ విద్యార్థిని హత్యా ఘటనలతో ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నినుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకు చంద్రబాబు సర్కారు కేఎస్‌ఆర్‌ లైవ్‌ షోను అడ్డం పెట్టుకుంది. తాను చేయని వ్యాఖ్యలకు.. సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించింది. అయితే ఈ అరెస్ట్‌కు ముందుకు కొమ్మినేనిపై కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రకు తెరతీసింది. 

ఆ కుట్రంతా లోకేష్‌ కనుసన్నల్లోనే జరిగింది. అసలేం జరిగిందంటే? ఈ నెల 6న సాక్షి టీవీ డిబేట్‌లో విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యలను డిబేట్‌లో కొమ్మినేని వారించారు. ఇది జరిగిన 24 గంటల తర్వాత.. ఈ నెల 7న ఆ వ్యాఖ్యలను ఐటీడీపీ వైరల్‌ చేసింది. కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీకి, వైఎస్‌ జగన్‌కు ఆపాదిస్తూ విషప్రచారం చేయించింది. వెను వెంటనే పథకం ప్రకారం టీడీపీ అనుకూల వ్యక్తులతో అమరావతిలో లోకేష్‌ అమరావతిలో ప్రదర్శనలు చేయించారు.

తాను చేసిన వ్యాఖ్యలపై కృష్ణం రాజు క్షమాపణ చెప్పినా..  వైఎస్‌ జగన్‌ కుటుంబసభ్యులపై అసభ్య వ్యాఖ్యలు, పోస్టింగ్‌లు పెట్టారు. నిన్న (ఆదివారం) టీడీపీ వారితో రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేయించారు.

ఇది ఓ వైపు జరుగుతుండగా ప్రణాళికా బద్ధంగా నిన్న మధ్యాహ్నం 1.49కి సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేశారు. చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి మద్దతుగా పవన్‌ ఆఫీస్‌ నుంచి మధ్యాహ్నం 3.40కి ప్రెస్‌ నోట్‌ విడుదలైంది. తర్వాత సాయంత్రం 6.45కి పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోపే హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇలా చంద్రబాబు అండ్‌ కో.. ఏపీలో కొనసాగుతున్న దారుణల్ని, అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్‌ చేసేందుకు కొమ్మినేని అరెస్ట్‌ చేశారంటూ ఏపీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులు సైతం కూటమి ప్రభుత్వం తీరును ఖండిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement