మోక్షితకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదెవరు? | Mokshita lost her chance in triple IT and Gurukul due to SSC board mistake | Sakshi
Sakshi News home page

మోక్షితకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదెవరు?

May 31 2025 4:33 AM | Updated on May 31 2025 4:33 AM

Mokshita lost her chance in triple IT and Gurukul due to SSC board mistake

వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో గంగిరెడ్డి మోక్షిత తొలుత పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఫెయిల్‌ అయింది. విచిత్రంగా.. తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లిష్‌లో సోషల్‌లో 84, గణితంలో 93, సైన్స్‌లో 98 మార్కులు వచ్చిన ఈమెకు సోషల్‌ స్టడీస్‌లో మాత్రం 21 మార్కులే వచ్చాయి. పరీక్ష తప్పినట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. 

కానీ, తన ప్రతిభపై గట్టి నమ్మకం ఉన్న మోక్షిత తండ్రి సాయంతో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసింది. ఈసారి 84 మార్కులు వచ్చాయి. అప్పుడు ఎస్‌ఎస్‌సీ బోర్డు మొత్తం 537 మార్కులతో మోక్షిత పదో తరగతి ఉత్తీర్ణులైనట్టు ప్రకటించింది. కానీ, నిజం కాని ఫెయిల్‌కు–నిజమైన పాస్‌కు మధ్యలో ట్రిపుల్‌ ఐటీ, రెసిడెన్షియల్, గురుకులాల్లో ప్రవేశ దరఖాస్తులకు అవకాశం కోల్పోయింది మోక్షిత.

ఈ దోషం ఎవరిది..??
‘‘అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ విద్యార్థినికి పదో తరగతిలో 540 మార్కులు వచ్చాయి. ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 96, ఇంగ్లిష్‌లో 87, గణితంలో 93, సైన్స్‌లో 95, సోషల్‌లో 96 స్కోర్‌ చేసింది. కానీ, హిందీలో 73 మార్కులే వచ్చాయి. దీంతో సందేహం వచ్చి రూ.వెయ్యి చెల్లించి రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. ఒక్క మార్కు కూడా పెరగలేదు. విద్యార్థికి పీడీఎఫ్‌ రూపంలో అందించిన జవాబు పత్రాన్ని చూస్తే.. నాలుగు మార్కుల ప్రశ్నల్లో నాలుగింటికి ‘సున్నా’ వేశారు. 

‘సాక్షి’.. ఈ మూల్యాంకన పత్రాన్ని ఉపాధ్యాయ వృత్తిలో అనుభవజ్ఞులైనవారికి చూపించగా జవాబుల్లో స్వల్ప అక్షర దోషాలు తప్ప మరే సమస్య లేదని, కచ్చితంగా ఒక్కో ప్రశ్నకు మూడు, నాలుగు మార్కులు వస్తాయని చెప్పారు. అంటే, ఆ విద్యార్థిని 12 నుంచి 16 మార్కులు కోల్పోయినట్లేగా?

34 నుంచి ఏకంగా 93కు..
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బాలిక ఆర్‌.సాయికుందనకు పదో తరగతి ఫలితాల్లో 489 మార్కులు వచ్చినా ఫెయిల్‌ అయ్యింది. ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 94, హిందీ 79, గణితం 96, సైన్స్‌ 92, సోషల్‌ 94 మార్కులు రాగా.. ఇంగ్లిష్‌లో మాత్రం 34 వచ్చాయి. ఫీజు కట్టి రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయంగా ఇంగ్గిష్‌లో 34 మార్కులు కాస్తా 93కు పెరిగాయి. అంటే, ఏకంగా 59 మార్కులు వ్యత్యాసం కనిపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement