రాష్ట్రంలో ఒకవైపు తీవ్రమైన ఎండలు కాస్తుండగా.. మరోవైపు కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఈ సీజన్లోనే గరిష్టంగా కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అన్నమయ్య జిల్లా పుంగనూరు, అనకాపల్లి జిల్లా రావికమతం, విశాఖ జిల్లా ఆనందపురం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.


