పవన్‌ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి కూడా..

Minister Perni Nani Comments On Pawan Kalyan - Sakshi

మంత్రి పేర్ని నాని

సాక్షి, తాడేపల్లి: పవన్ కల్యాణ్ అద్దె మైక్‌లా తయారయ్యారని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఆదివారం  ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘2014లో బీజేపీకి.. తర్వాత టీడీపీకి ఓటు వేయాలని పవన్ అన్నారు. దక్షిణాదికి ఉత్తరాది వాళ్లు అన్యాయం చేస్తున్నారని పవన్ రంకెలేశారు. పాచిపోయిన లడ్డూను పవన్ తుడుచుకుని తింటున్నారా’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. వెంకన్న స్వామి ఎవరికి శిక్ష వేశారు? పవన్‌కు గుండు కొట్టిందెవరు? గత ప్రభుత్వ హయాంలో ఆలయాలను ధ్వంసం చేస్తే పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని దుయ్యబట్టారు. 

‘‘పవన్‌కల్యాణ్‌ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి కూడా. పవన్‌కల్యాణ్ నిబద్ధత లేని నాయకుడు. కాపులపై గత ప్రభుత్వం కేసులు పెడితే పవన్ ఎందుకు మాట్లాడలేదు?. చిరంజీవి తమ్ముడిగానే పవన్‌కు గుర్తింపు వచ్చింది. బీజేపీతో పవన్‌ కలిసే ఉన్నారు కదా హోదాపై ఎందుకు నిలదీయడంలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి పవన్ ఎందుకు మాట్లాడటం లేదు. అంతర్వేది రథం ఘటనలో బీజేపీ ఎందుకు సీబీఐ విచారణకు ఒప్పుకోలేదు? రథాలు దగ్ధం చేయడంలో బీజేపీ పాత్ర ఉందని.. పవన్‌కల్యాణ్ మాటలతో అనుమానం కలుగుతోందని మంత్రి పేర్ని నాని అన్నారు.

చదవండి:
కుప్పం టీడీపీలో ముసలం.. 
దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..? 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top