ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే సుధాకర్‌ | Sakshi
Sakshi News home page

ప్లాస్మా దానం చేసిన కోడుమూరు ఎమ్మెల్యే

Published Wed, Jul 29 2020 3:28 PM

Kodumuru MLA Sudhakar Donated Plasma - Sakshi

సాక్షి, కర్నూలు: ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చిందని భయపడకూడదని, అలాగని అజాగ్రత్తగా కూడా ఉండకూడదన్నారు. తనకు గత నెల 20న కరోనా వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ప్లాస్మా దానం వల్ల మరో ముగ్గురు కరోనా బాధితులకు ప్రాణదానం చేయవచ్చన్నారు. (ఆత్మస్థైర్యంతో జయించా)

Advertisement
Advertisement