Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | Devotees Rush Increases at Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

May 24 2025 7:45 AM | Updated on May 24 2025 1:13 PM

Devotees Rush Increases at Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో పాటు వారాంతం కావడంతో శుక్రవారం ఉదయం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. 

ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.  గురువారం అర్ధరాత్రి వరకు 74,374  మంది స్వామిని దర్శించుకున్నారు.  37,477 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.02  కోట్లు సమర్పించారు.

టైమ్ స్లాట్ (  ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు  24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement