Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Crowd of Devotees Increased in Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Mar 14 2025 8:52 AM | Updated on Mar 14 2025 8:52 AM

Crowd of Devotees Increased in Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 51,148 మంది స్వామిని దర్శించుకున్నారు. 21,236 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.56  కోట్లు సమర్పించారు.

టైమ్ స్లాట్ (  ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.   

 

 

Advertisement
 
Advertisement
Advertisement