పీడీఎస్‌ కాదు.. ‘మనోహర‘మైన బియ్యం..! | Collector Gives Clean Chit To Rice Seized At Visakhapatnam Port, More Details Inside | Sakshi
Sakshi News home page

పీడీఎస్‌ కాదు.. ‘మనోహర‘మైన బియ్యం..!

Jan 5 2025 5:35 AM | Updated on Jan 5 2025 10:50 AM

Collector gives clean chit to rice seized at Visakhapatnam port

విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్‌ క్లీన్‌ చిట్‌

వాటిని బిబో సంస్థకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు 

రేపో మాపో చైనాకి బియ్యం తరలింపు!

సాక్షి, విశాఖపట్నం: మంత్రి పట్టుకున్న­ప్పుడు రేషన్‌ బియ్యం నెల రోజుల్లోనే సాధారణ బియ్యంగా మారిపోవడం కూటమి నేతలు చేసిన మ్యాజిక్కే. మంత్రి అనుచరుల మంత్రాంగమే. చేతులు తడిపితే చాలు.. పేదోడి బియ్యం కూడా ‘మనోహర’మైన బియ్యంగా మారిపోతు­న్నాయి. రేషన్‌ బియ్యమే అయినా.. దర్జాగా షిప్‌ ఎక్కి దేశాలు దాటిపోతు­న్నా­యి.    పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గత నెల 9న విశాఖపట్నం కంటైనర్‌ టెర్మినల్‌కు వచ్చి  పో­ర్టు కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్లలో తనిఖీలంటూ హడా­వుడి చేశారు. 

బియ్యాన్ని నాలుగైదుసార్లు రెండు చేతు­ల్లో అటు ఇటూ తిప్పి.. ఇవి 100 శాతం పీడీఎస్‌ బియ్యం.. సీజ్‌ ది రైస్‌.. అంటూ ఆదేశాలు జారీ చేసి, అక్కడ ఉన్న రెండు సంస్థలకు చెందిన 483 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాకినా­డ నుంచి బిబో ఇంటర్నేషనల్‌ సంస్థ  తెచ్చిన 8 లారీ­ల లోడు (259 టన్నులు) మొత్తం రేషన్‌ బియ్యమే అని మంత్రి, అధికారులు, ప్రత్యేక బృందాలు ప్రక­టించారు. 48 గంటల్లో సమగ్ర డాక్యుమెంట్లు తేకపో­తే బియ్యా­న్ని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. 

48 గంటలు గడిచినా ఏ చర్యా లేదు. ఇంతలో మంత్రి అనుచరులు రంగప్రవేశం చేసి, సీను మొత్తాన్ని మార్చేసినట్లు చెబుతు­న్నారు. మొత్తం బియ్యం వ్యాపారాన్ని నిలిపి­వేయి­స్తామని ఆ ఎక్స్‌­పోర్టు సంస్థని బెదిరించినట్లు సమా­చారం. దీంతో ఆ సంస్థ వారు అడిగిన మొత్తా­నికి ఒప్పందం కుదుర్చు­కున్న తర్వాత ఆ బియ్యం రేషన్‌ బియ్యం కాదని క్లీన్‌చిట్‌ ఇచ్చేస్తున్నారని కొందరు అధికారులే చెబుతు­న్నారు. 

మంత్రి అనుచరులు ఉన్న­తాధికారులపై తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఆ బియ్యా­నికి క్లీన్‌ చిట్‌ ఇచ్చి, ఎగుమతికి ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ బియ్యాన్ని రేపో మాపో నౌకలో చైనా పంపేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపో­తున్నాయి. మరో సంస్థ మాత్రం ఇంకా బేరం కుదు­ర్చు­కోకపోవడంతో మిగతా బియ్యం అలాగే ఉండిపోయింది.

విశాఖ కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌ (సీఎఫ్‌ఎస్‌) 
నుంచి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 టన్నుల రేషన్‌ బియ్యాన్ని గుర్తించి సీజ్‌ చేశాం. కాకినాడ పోర్టులో నిఘా పెరగడం వల్ల వైజాగ్‌ పోర్టు నుంచి స్మగ్లింగ్‌ చేస్తున్నారు. అందుకే తనిఖీ చేసి పట్టుకున్నాం. వారిపై కేసులు కూడా పెడుతున్నాం. ఇకపై ఒక్క గింజ పీడీఎస్‌ బియ్యం కూడా పోర్టు దాటి వెళ్లకుండా పేదలకు చేర్చడమే మా లక్ష్యం.   
– డిసెంబర్‌ 9న పౌర సరఫరాల శాఖ  మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేసిన ప్రకటన

కట్‌ చేస్తే..: పోర్టులో మంత్రి నాదెండ్ల సమక్షంలో పట్టుకున్న 483 టన్నుల బియ్యంలో 259 టన్నులు రేషన్‌ బియ్యం కాదు. ఆ 8 లారీల్లో బిబో సంస్థ తెచ్చిన బియ్యాన్ని నిరభ్యంతరంగా ఎగుమతి చేసుకోవచ్చు.– ఈ నెల 2న జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ జారీ చేసిన సర్క్యులర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement