అ‍మరావతి రైతులు చేస్తున్నది పాదయాత్రకాదు..

Bahujana Parirakshana Samithi Leaders Comments On Chandrababu In Amaravati - Sakshi

అమరావతి: అమరావతి రైతులు చేస్తున్నది పాదయాత్ర కాదు.. అది ఒక రాజకీయ యాత్ర అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ యాత్రకు కర్త,కర్మ,క్రియ అ‍న్ని చంద్రబాబే.. అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు విమర్శించారు.

బహుజన పరిరక్షణ సమితి నేతల దీక్షలు 400వ రోజులకు చేరుకున్నాయి. పేదవారికి ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. ‘న్యాయస్థానం–దేవస్థానం’ అంటూ చంద్రబాబు కొత్తనాటకానికి  తెరతీశారని మండిపడ్డారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top