సాక్షి, నెల్లూరు: సోమశిల ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేతల చలో సోమశిల సందర్శనకు పోలీసులు ఆటంకం సృష్టించారు. పార్టీ నేతలు అక్కడికి చేరుకుంటున్నారనే సమాచారంతో సోమశిల ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. అనంతరం, వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ శ్రేణులు గేట్లు దూకి ప్రాజెక్ట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు తీరు, కూటమి ప్రభుత్వం ఓవరాక్షన్పై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


