
ప్రమాదంలో ఫైర్మెన్ మృతి
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఫైర్ మెన్ సుధాకర్ (40) దుర్మరణం పాలయ్యారు. అనంతపురంలో నివాసముంటున్న ఆయన పుట్టపర్తిలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఫైర్మెన్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం విధులు ముగించుకున్న ఆయన అనంతపురానికి వెళ్లే క్రమంలో మామిళ్లపల్లికి చేరుకున్నారు. అనంతరం బస్సు కోసం జాతీయ రహదారిని దాటుతుండగా బెంగళూరు నుంచి అనంతపురం వైపుగా వేగంగా వెళుతున్న లారీ ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య రమ్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.