ఎస్పీ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తున్న అదనపు ఎస్పీ మోహన్రావు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు సోమవారం 55 ఆర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు ఆర్జీదారుల ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, కుటుంబ సమస్యలు, మోసపూరిత హామీలు, ఆర్థిక నేరాలు, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వాటిపై ఆర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎస్.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


