చింతపల్లి: స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహిస్తున్న సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 14న తుది కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 14న గుంటూరు లాం ఫారంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న కౌన్సెలింగ్కు టెన్త్ ఉత్తీర్ణులైన, ఇంటర్ ఉత్తీర్ణులైన, ఫెయిల్ విద్యార్థులు అయిన హాజరుకావచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏడీఆర్ తెలిపారు.


