ఇచ్చోడ: ఏజెన్సీ ప్రాంతాల్లో మాతా శిశుమరణాలను పూర్తిగా అరికట్టేలా వైద్య సిబ్బంది ప్ర త్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సంకల్ప్ ప్రో గ్రాం ఆఫీసర్ కీర్తిరెడ్డి ఆదేశించారు. గురువా రం ఇచ్చోడ పీహెచ్సీని సందర్శించి పలు రికా ర్డులు, మందుల నిల్వలు, ఓపీ, సిబ్బంది హాజ రు శాతాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అస్పత్రులకు వచ్చే గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. డీహెంహెచ్వో డాక్టర్ సాధన, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్రాథోడ్, స్థానిక వైద్యాధికారి మధురిమ, సీహెచ్వో బ్రహ్మానందంరెడ్డి, సిబ్బంది ఉన్నారు.


