జిల్లాకు ‘టీఎస్‌ఎఫ్‌సీ’ | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు ‘టీఎస్‌ఎఫ్‌సీ’

Sep 2 2026 2:40 AM | Updated on Sep 2 2026 2:40 AM

● 18 ఏళ్ల తర్వాత తిరిగి ఆదిలాబాద్‌కు ● కార్యాలయం రాకతో పరిశ్రమల స్థాపనకు ఊతం

కై లాస్‌నగర్‌: తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎఫ్‌సీ) శాఖ మళ్లీ జిల్లాకు వస్తోంది. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ఆదిలాబాద్‌ కేంద్రంగా ఎంతో మంది వ్యాపారులకు ఆర్థికచేయూతనందించి పరిశ్రమల స్థాపనకు తోడ్పడింది. అయితే ఈ కా ర్యాలయాన్ని 2008లో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో మంచిర్యాలకు తరలించారు. 18 ఏళ్లుగా జిల్లావాసులకు దూరమైన టీఎస్‌ఎఫ్‌సీ శాఖను మళ్లీ స్థానికంగాఅందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణంలోని జెడ్పీ సమీపంలో గల ఆ సంస్థ పాత కార్యాలయానికి ఆనుకుని సొంత భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయ పునరుద్ధరణకు అవసరమైన పనులు ప్రారంభమయ్యాయి. నవంబర్‌ నాటికి పూర్తిస్థాయిలో కా ర్యకలాపాలు అందుబాటులోకి వచ్చే అవకాఽశముందని ఆ సంస్థ సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ మహ్మద్‌ అలీం తెలిపారు.

జిల్లా అభివృద్ధికి దోహదం ..

ఎయిర్‌పోర్టు, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఏళ్లుగా జిల్లాకు దూరమైన రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సంస్థ తిరిగి సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. మంచిర్యాల జిల్లాలో ఈ కార్యాలయం ఉన్నప్పటికీ ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల వ్యాపారులు, ప్రజలకు సేవలందించేందుకు ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడి ప్రజలు కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలంటే వందలాది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. వాటిని దూరం చేసేలా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సంస్థ పారిఽశ్రామిక, సేవా రంగాల్లో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే, ఉన్న వ్యాపారాలను మరింత వృద్ధి చేసేందుకు అవసరమైన రుణాలను అందజేయనుంది. హార్డ్‌వేర్‌, బట్టల దుకాణాలు , రైస్‌, కాటన్‌, జిన్నింగ్‌ మిల్లులు వంటి ఇతర వ్యాపారాలతో పాటు ఆసుపత్రులు, ఫంక్షన్‌హాళ్లు, హోటళ్లు వంటి వాటి ఏర్పాటుకు అవసరమైన రుణాలు అందజేయనుంది. దీంతో జిల్లాలో ఔత్సాహిక వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. కొత్త పరిశ్రమల స్థాపనకు ఊతమివ్వడం ద్వారా జిల్లా అభివృద్ధికి తోడ్పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement