కై లాస్నగర్: భూ సమస్య పరిష్కరించాలని ఒకరు.. ఇందిరమ్మ ఇంటి బిల్లు రావడం లేదని మరొకరు.. ఉపాధి కల్పించాలని ఇంకొకరు ఇలా పలు సమస్యలతో తరలివచ్చిన బాధితులు కలెక్టర్ రాజర్షి షాకు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావే శ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా న లుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు గంట ల తరబడి బారులు తీరారు. కలెక్టర్కు తమ గోడు విన్నవించుకున్నారు. అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు తో కలిసి అర్జీలు స్వీకరించిన ఆయన దరఖా స్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ స త్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఆర్వో స్రవంతి, జెడ్పీ సీఈవో రవి పా ల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.
దరఖాస్తుదారు సమస్య వింటున్న కలెక్టర్ రాజర్షి షా


