క్రీడాకారుల గుర్తింపునకే పోటీలు
తాంసి: గ్రామాల్లోని క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడానికే ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోందని డీవైఎస్వో శ్రీనివాస్ పే ర్కొన్నారు. పొటీల్లో భాగంగా చేపట్టిన టార్చ్ రిలే ర్యాలీ శుక్రవారం మండల కేంద్రానికి చేరుకోగా ఎంపీడీవో మోహన్రెడ్డి, తహసీల్దార్ ల క్ష్మి స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎ స్వో మాట్లాడుతూ.. ఈ నెల 17నుంచి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ని క్రీడాకారులు పంచాయతీ కార్యదర్శుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. డీటీ ప వన్ జాదవ్, ఆర్ఐ సంతోష్, వివిధ శాఖల అ ధికారులు, పంచాయతీ కార్యదర్శులున్నారు.


