
పార్టీ విధేయులకు పదవులు
కైలాస్నగర్: కాంగ్రెస్కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, పార్టీకి విధేయులుగా ఉన్న వారందరికి త్వరలోనే నామినేటెడ్ పదవులతో సముచితస్థానం కల్పిస్తామని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, పీసీసీ పరిశీలకులు తాహెర్బిన్ హందాన్, చిట్ల సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్ లో సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వారు అతిథులుగా హాజరయ్యా రు. తొలుత పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు సంతాప సూచకంగా మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడారు. పార్టీ పరంగా జిల్లాకు ఎంతో చరిత్ర ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎంతో మంది జాతీయ నాయకులుగా ఎదిగారని గుర్తు చేశారు. జిల్లాలో పార్టీని బూత్స్థాయి నుంచి ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మే 3నుంచి 10వరకు ఆయా మండలాల అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. ఒక్కో పదవికి మూడు పేర్లను పరిగణలోకి తీసుకుని నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎంపిక చేస్తామన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసే ప్రతీ కార్యకర్తకు పదవులు వెతుక్కుంటూ వస్తాయని భరోసానిచ్చారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా మే 30లోపు డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీఎమ్మెల్యే రాథోడ్ బా పూరావు, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్, నాయకులు గోవర్ధన్రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గణేష్రెడ్డి, అశోక్రెడ్డి, శ్రీధర్, చంటి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ఆమోదయోగ్యంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక
పీసీసీ జిల్లా పరిశీలకులు తాహెర్బిన్ హందాన్, సత్యనారాయణ