
వైద్యసేవల కోసం ఆధార్ తప్పనిసరి
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం కోసం వచ్చే సమయంలో రోగులు తప్పనిసరిగా ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధిగ్రస్తుల సమాచారం ఆన్లైన్లో పొందుపర్చడం జరుగుతుందని, భవిష్యత్లో రోగికి సంబంధించిన సేవలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. రిమ్స్, సామాజిక ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆధార్ తప్పనిసరి అని పేర్కొన్నారు.
సమయపాలన పాటించాలి
తలమడుగు: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీని తని ఖీ చేశారు. సిబ్బంది హాజరు, స్టాక్ రిజిస్టర్ పరి శీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సకా లంలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
విధులు సక్రమంగా నిర్వర్తించాలి
తాంసి: వైద్యసిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులతో పాటు ఫార్మసీ గదిలో నిల్వ ఉన్న మందులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట సిబ్బంది దీప, నర్మద ఉన్నారు.