breaking news
Single movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈ వారం థియేటర్లలోకి వచ్చిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' తేలిపోయింది. పూర్తిగా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు శుక్రవారం.. బద్మాషులు, శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే చిన్న సినిమాలు వచ్చాయి. కాకపోతే వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. కానీ ఓటీటీల్లోకి మాత్రం ఏకంగా 33 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి.(ఇదీ చదవండి: సడన్గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్' శుభశ్రీ)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వడక్కన్, ఓ యుముడి ప్రేమకథ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. వీటితో పాటు 'దేవిక & డానీ' అనే తెలుగు సిరీస్ కూడా కాస్త ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (జూన్ 06)అమెజాన్ ప్రైమ్సింగిల్ - తెలుగు సినిమాసుశీల సుజిత్ - మరాఠీ మూవీబెంగాల్ 1947: ద అన్టోల్డ్ స్టోరీ - హిందీ సినిమామట్ లాక్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్జొరకయ్యా తట్టుంగ - తమిళ సినిమాగ్రౌండ్ జీరో - హిందీ మూవీభోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమాఅంటిల్ డాన్ - ఇంగ్లీష్ మూవీగుల్కండ్ - మరాఠీ సినిమాపారిస్ ఇన్ బాలీ - ఇండోనేసియన్ మూవీద అకౌంటెంట్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాహాట్స్టార్దేవిక & డానీ - తెలుగు సిరీస్గెట్ ఎవే - ఇంగ్లీష్ మూవీఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ - ఇంగ్లీష్ సినిమావై 2 కే - ఇంగ్లీష్ మూవీనెట్ఫ్లిక్స్కె.ఓ - ఇంగ్లీష్ సినిమామెర్సీ ఫర్ నన్ - కొరియన్ సిరీస్స్ట్రా - ఇంగ్లీష్ మూవీద సర్వైవర్స్ - ఇంగ్లీష్ సిరీస్గోల్డెన్ సిక్స్టీన్స్ సీజన్ 1 - జపనీస్ రియాలిటీ షోజాట్ - తెలుగు సినిమాజీ5ఛల్ కపట్ - హిందీ సిరీస్సన్ నెక్స్ట్లాల్ సలామ్ - తెలుగు డబ్బింగ్ సినిమాజిగేల్ - తెలుగు మూవీఆహావడక్కన్ - తెలుగు డబ్బింగ్ మూవీఒక యుమడి ప్రేమకథ - తెలుగు డబ్బింగ్ సినిమాలయన్స్ గేట్ ప్లేచౌర్య పాఠం - తెలుగు సినిమాకోడ్ 8 - ఇంగ్లీష్ మూవీహై ఫోర్సెస్ - చైనీస్ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్లఫంగే - హిందీ సిరీస్బుక్ మై షోద లాస్ట్ విష్ - తెలుగు డబ్బింగ్ మూవీమనోరమ మ్యాక్స్పట్త్ - మలయాళ సినిమా(ఇదీ చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ బొమ్మ.. ఎక్కడంటే?
సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఈ ఏడాది సింగిల్తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబట్టింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (జూన్ 6) నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇక్కడ మరో సర్ప్రైజ్ ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సింగిల్ అందుబాటులోకి రావడం విశేషం.సింగిల్ సినిమా కథేంటంటే?విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంకులో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్గానే ఉంటాడు. ఓసారి మెట్రో రైలులో పూర్వ (కేతిక శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిశోర్) సాయంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తాడు. అదే సమయంలో విజయ్ జీవితంలో హరిణి (ఇవానా) వస్తుంది. పూర్వను పడేసేందుకు విజయ్ ఏమేం చేస్తాడో హరిణి కూడా అవన్నీ చేస్తుంది. అతడు ఛీ కొట్టినా అతడి వెనకాలే తిరుగుతుంది. అసలు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదంటే హరిణి ప్రేమకు పడిపోతాడా? అదీకాక సింగిల్గానే మిగిలిపోయాడా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సింగిల్ (Single Movie) చూడాల్సిందే!చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
Single Movie: థియేటర్లలో నవ్వులే నవ్వులు
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం సింగిల్. ఈ నెల 9న విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ సింగిల్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. చిత్రంలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ నవ్విస్తున్నాయని చెప్పారు. దర్శకుడు కార్తీక్ రాజు చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, నిర్మాతలు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సహకారం అందించారన్నారు. కథ సాధారణంగా ఉన్నప్పటికీ, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన సంభాషణలతో సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోందని ఆయన పేర్కొన్నారు. చిత్రంలో నటించిన కేతిక శర్మ, ఇవానా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష ప్రభాస్ శ్రీను, సత్య, కల్పలత తమ పాత్రలకు ప్రాణం పోశారని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ సూపర్ నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ, సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడన్నారు. కామెడీ సన్నివేశాల్లో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని తెలిపారు. సినిమాలో అనేక ఆసక్తికరమైన పాత్రలు, మలుపులు పెట్టి దర్శకుడు కార్తీక్రాజు ప్రేక్షకులను నవి్వంచారని, ముఖ్యంగా సెకండాఫ్లోని ప్రేమ సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని ఆయన తెలిపారు. విశాఖ అంటే చాలా ఇష్టం హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా మాట్లాడుతూ విశాఖ అంటే తమకు చాలా ఇష్టమని, ఈ సినిమాలో నటించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్తో కలిసి నటించిన సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయని వారు తెలిపారు. విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవి్వంచారని వారు కొనియాడారు. -
వీకెండ్ విన్నర్ '#సింగిల్'.. వసూళ్లు ఎంతొచ్చాయంటే?
గత వీకెండ్ మూడు నాలుగు సినిమాలు రిలీజైతే వాటిలో శ్రీ విష్ణు '#సింగిల్' హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలానే కలెక్షన్లలోనూ మంచి జోరు చూపిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయినట్లు తెలుస్తోంది. అలానే లాభాలు కూడా వస్తున్నాయి. ఈ కామెడీ మూవీకి ఇప్పటివరకు ఎంత వసూళ్లు వచ్చాయి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్)శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన '#సింగిల్' సినిమాకు నాలుగు రోజుల్లో రూ.19.01 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. గత వీకెండ్ లో సమంత నిర్మించిన శుభం కూడా విడుదలైంది గానీ ఈ సినిమా దెబ్బకు పూర్తిగా డల్ అయిపోయినట్లు కనిపిస్తుంది.ట్రెండింగ్ సోషల్ మీడియా కంటెంట్ బేస్ చేసుకుని రాసుకున్న జోక్స్.. సింగిల్ మూవీకి చాలా ప్లస్ అయ్యాయి. అలానే శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్ కాంబో కూడా క్లిక్ అయింది. దీంతో ప్రేక్షకులు ఈ మూవీకే ఓటేస్తున్నారు. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి సింగిల్ చిత్రానికే ప్లస్ అవ్వొచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా) -
మూడురోజుల్లో సింగిల్ కలెక్షన్స్.. మీ థియటర్స్కే హీరో హీరోయిన్లు
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘సింగిల్’ సినిమా దుమ్మురేపుతుంది. శుక్రవారం(మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మూడురోజుల్లోనే రూ. 16.30 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు తాజాగా ఒక పోస్టర్ను వారు విడుదల చేశారు. ఇందులో శ్రీవిష్ణు (Sree Vishnu)తో కేతిక శర్మ, ఇవానా నటించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమా విడుదలరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సింగిల్ చిత్రం.. ఊహించినదానికంటే భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. శ్రీవిష్ణు కెరీర్లో మరో భారీ హిట్గా ఈ చిత్రం నిలిచింది. దీంతో ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్లోని పలు థియేర్స్కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సందడి చేస్తున్నారు.సింగిల్ సినిమా జైత్రయాత్రలో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా మీ ఊరి థియేటర్స్కే నేటి నుంచి వచ్చేస్తున్నారు. మే 12న సాయంత్రం 6గంటలకు వైజాగ్లోని మెలోడీ థియేటర్, మే 13న ఉదయం 11గంటలకు రాజమండ్రి అప్సర, మధ్యాహ్నం 2గంటలకు ఏలూరులోని ఎస్వీసీ, సాయంత్రం 6గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్స్కు వారు రానున్నారు. మే 14న ఉదయం 11గంటలకు గుంటూరు మైత్రీ, మధ్యాహ్నం 2గంటలకు నరసరావుపేట గీతా మల్టీఫ్లెక్స్లో చిత్ర యూనిట్ సందడి చేయనుంది. -
ఆ సినిమా వల్లే బాలీవుడ్లో ఆఫర్ వచ్చింది: శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు సింగిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నెల 9 నుంచి సింగిల్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. మొత్తం రెండురోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 11.2 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు కెరీర్లో మరో భారీ హిట్గా సింగిల్ మూవీ నిలిచింది.సింగిల్ రిలీజ్ నేపథ్యంలో శ్రీ విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాతో ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రారంభంలో చిరంజీవి, వెంకటేశ్ లాంటి పెద్ద హీరోలు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఎనర్జీ ఇచ్చేదన్నారు. బ్రోచెవారేవరురా లాంటి సినిమాకు చాలా ప్రశంసలు వచ్చాయి.. ఆ సమయంలో గొప్ప ఫీలింగ్ కలిగిందని తెలిపారు. బన్నీ, రవితేజ నా ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తుంటారని వెల్లడించారు.ఇక స్వాగ్ సినిమా విషయానికొస్తే.. తమిళం నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. అలాగే మొదటిసారి స్వాగ్ మూవీ తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని శ్రీ విష్ణు వెల్లడించారు. కాగా.. సింగిల్ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా దర్శకుడు కార్తీక్ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. -
రెండోరోజు భారీగా పెరిగిన 'సింగిల్' కలెక్షన్స్
ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే చిత్రంగా బాక్సాఫీస్ వద్ద ‘సింగిల్’ సినిమా దుమ్మురేపుతుంది. శుక్రవారం(మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రెండోరోజు కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ఇందులో శ్రీవిష్ణు (Sree Vishnu)తో కేతిక శర్మ, ఇవానా నటించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు వన్లైన్ పంచ్లతో పాటు వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. మొదటిరోజు మంచి టాక్ రావడంతో రెండోరోజు భారీగా కలెక్షన్స్ పెరిగాయి. డే1 రూ. 4.15 కోట్లు రాగా, రెండోరోజు రూ. 7.05 కోట్లు వచ్చాయి. మొత్తం రెండురోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 11.2 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు కెరీర్లో మరో భారీ హిట్గా ఈ చిత్రం నిలిచింది. సింగిల్ సినిమా కథ, స్క్రీన్ప్లే ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుందని నెటిజన్లు కామెంట్ల రూపంలో చెబుతున్నారు.సామజవరగమన, ఓం భీమ్ బుష్ వరుస హిట్లు అందుకున్న శ్రీవిష్ణు శ్వాగ్ (Swag) సినిమాతో కాస్త నిరుత్సాహపరిచాడు. అయితే, ఇప్పుడు సింగిల్ సినిమాతో దుమ్మురేపాడని చెప్పొచ్చు. మూడు జనరేషన్ల మైండ్సెట్లను వినోదాత్మకంగా తెరపై చూపించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సినిమాలు ఏవీ లేవు. ఇది సింగిల్ సినిమాకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. దీంతో మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతభాగం భారత సైనికులకు విరాళంగా ఇస్తామని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇప్పుడు అంతా బోనస్: ‘వెన్నెల’ కిశోర్
‘‘నా కెరీర్లో కామెడీపాత్రలు చాలా చేశాను. వీటిలో నా ఫేవరెట్ రోల్స్ చాలానే ఉన్నాయి. కానీ ‘వెన్నెల, బిందాస్, దూకుడు’ సినిమాల్లో చేసినపాత్రలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏవీ లేవు. ‘దూకుడు’ సినిమాలో నేను చేసిన రోల్ (ఎమ్ఎస్. రామానుజమ్ శాస్త్రి)తోనే నా డ్రీమ్ నెరవేరిపోయింది. ఇప్పుడు అంతా బోనస్’’ అన్నారు ‘వెన్నెల’ కిశోర్. శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సింగిల్’లో ‘వెన్నెల’ కిశోర్ ఓ కీలకపాత్ర చేశారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న (శుక్రవారం) విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో ‘వెన్నెల’ కిశోర్ మాట్లాడుతూ – ‘‘సింగిల్’లో నేను చేసిన అరవింద్పాత్రకు మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సినిమాలను నేనెక్కువగా థియేటర్స్లో చూసుకోను. కానీ ఈ సినిమాను థియేటర్స్లో చూశాను. నాపాత్రను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న తీరు నాకు సంతోషాన్నిచ్చింది. నేను ఏపాత్ర చేసినా ఆపాత్ర వల్ల సినిమా కథ ముందుకెళితే చాలు.ప్రస్తుతం రచయితలకు సరైన గౌరవం,పారితోషికం లభించడం లేదు. అందుకే వాళ్లు డైరెక్టర్స్ అయిపోతున్నారు. ఇక హీరోగా ఒకట్రెండు సినిమాలు చేశాను. కానీ ఎక్కువగా లవ్స్టోరీ సినిమాలు వస్తున్నాయి. రొమాన్స్, సాంగ్స్ నాకు నప్పవు. అలాగే నాపాత్ర చనిపోయే కథలు కూడా వచ్చాయి. కానీ అలాంటిపాత్ర చేయడం నాకు ఇష్టం లేదు. ఇక మంచి కామెడీ కథ కుదిరితే హీరోగా చేస్తా. ‘జఫ్ఫా’ సినిమాతో దర్శకుడిగా ఫెయిల్ అయ్యాను. భవిష్యత్లో దర్శకత్వం చేస్తాను. థ్రిల్లర్ మూవీస్ చేయాలని ఉంది’’ అన్నారు. -
శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పడింది. ఆయన నటించిన తాజా చిత్రం ‘#సింగిల్’ ఈ శుక్రవారం(మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చి.. హిట్ టాక్ని సంపాదించుకుంది. శ్రీవిష్ణు వన్లైన్ పంచ్లు, వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ రావడంతో తొలిరోజు భారీ కలెక్షన్లనే రాబట్టింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.4.15 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. (చదవండి: #సింగిల్ మూవీ రివ్యూ)బుక్మై షోలో 24 గంటల్లోనే 50.71 వేల టికెట్లు బుక్ అయ్యాయి. హిట్ టాక్ రావడంతో రెండో రోజు కూడా భారీగానే బుకింగ్స్ జరిగాయి. సినిమాకు వచ్చిన టాక్ని బట్టి చూస్తే..వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతభాగం భారత సైనికులకు విరాళంగా ఇస్తామని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక సినిమా విషయానికొస్తే.. ఈ ట్రయాంగిల్ లవ్స్టోరీలో శ్రీవిష్ణుకి జోడీగా కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా, వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. -
‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే
ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. మన సైనికులకు అండగా ఉంటానని మాటిచ్చారు. తన లేటెస్ట్ మూవీ వసూళ్ల నుంచి వచ్చే లాభాల్లో కొంత భాగం మన సైనికులకు విరాళంగా ఇస్తానని మాటిచ్చారు.(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి) చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అల్లు అరవింద్.. గతంతో పోలిస్తే సినిమాలు తీయడం బాగా తగ్గించేశారు. కొన్ని చిన్న చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అలా తీసిన లేటెస్ట్ మూవీ '#సింగిల్'. శ్రీ విష్ణు, కేతిక, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది.సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సందర్భంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాను భారత ఆర్మీకి అండగా ఉంటానని, సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతమేర ఆర్థిక సాయం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈయనలానే మిగతా దర్శక నిర్మాతలు హీరోహీరోయిన్లు కూడా సాయం చేసి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరుకుందాం.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) -
‘#సింగిల్’ మూవీ రివ్యూ
శ్రీవిష్ణు.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది ఓం భీమ్ బుష్, శ్వాగ్ చిత్రాలతో రెండు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీవిష్ణు.. ఇప్పుడు ‘#సింగిల్’ అంటూ ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘సింగిల్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 9) ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(#Single Movie Review).కథేంటంటే..?ఇదొక ట్రయాంగిల్ లవ్స్టోరీ. విజయ్ ఓ బ్యాంక్లో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్గానే ఉంటాడు. తన జీవితంలోకి కూడా ఒక అమ్మాయి రావాలని ప్రతి రోజు ఆ దేవుడిని కోరుకుంటాడు. ఓ సారి మెట్రో ట్రైన్లో పూర్వ(కేతికా శర్మ)ను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి స్నేహితుడు అరవింద్(వెన్నెల కిశోర్)తో కలిసి రకరకాల ప్లాన్ వేస్తాడు. ఇదే సమయంలో విజయ్ లైఫ్లోకి హరిణి(ఇవానా) వస్తుంది. పూర్వని ప్రేమలో పడేయడానికి విజయ్ ఏంఏం పనులో చేస్తాడో.. హరిణి కూడా కూడా అలానే చేస్తుంది. అసలు హరిణి ఎవరు? విజయ్ ఛీ కొట్టినా అతని వెనకాలే ఎందుకు తిరిగింది? చివరకు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదా హరిణి ప్రేమలో విజయ్ పడిపోయాడా? లేదంటే మళ్లీ విజయ్ సింగిల్గానే మిలిగిపోయాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే(#Single Movie Review ).ఎలా ఉందంటే.. హీరో ఒక హీరోయిన్ని ప్రేమించడం, మరో హీరోయిన్ అతన్ని ప్రేమించడం.. చివరకు ఈ విషయం ముగ్గురికి తెలిసి.. ఒకరు త్యాగం చేసి మరొకరు హీరోని పెళ్లి చేసుకోవడం.. ట్రయాంగిల్ లవ్స్టోరీలు అన్ని ఇలానే ఉంటాయి. దర్శకుడు కార్తీక్ రాజు రాసుకున్న స్టోరీ కూడా ఇలానే ఉంటుంది కానీ క్లైమాక్స్లో ఆయన ఇచ్చిన ట్వీస్ట్ కొత్తగా ఉంటుంది. ‘క్లైమాక్స్ రొటీన్గా ఉంటే నా కల్ట్ ప్యాన్స్ ఒప్పుకోరు’ అంటూ హీరోతోనే ఓ డైలాగ్ చెప్పించడమే కాకుండా..దానికి తగ్గట్లుగానే ముగింపు డిఫరెంట్గా ప్లాన్ చేశాడు. కథ పరంగా చూస్తే ఇదొక్కటే కొత్త పాయింట్. మిగతాదంతా రొటీన్, రెగ్యులర్ స్టోరీ. కానీ దర్శకుడు దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ , రాసుకున్న స్క్రీన్ప్లే సినిమాను కాపాడాయి. తెలిసిన కథే అయినా తెరపై శ్రీవిష్ణు వేసే పంచ్ డైలాగులకు, వెన్నెల కిశోర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందిస్తాయి. ఎలాంటి సాగదీతలు లేకుండా సినిమా ప్రారంభంలోనే ట్రైయాంగిల్ ప్రేమకథను మొదలు పెట్టాడు దర్శకుడు. పూర్వని పడేసేందుకు విజయ్ చేసే పనులన్నీ రొటీన్గానే ఉన్నా.. శ్రీవిష్ణు బాడీ లాంగ్వెజ్, వన్లైన్ పంచ్లు బాగా పెలడంతో బోర్ కొట్టదు. కథ ఏమిలేకున్నా ఫస్టాఫ్ కథనం ఫాస్ట్గానే సాగుతుంది. ఇక సెకండాఫ్లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. అయితే మూర్తి(రాజేంద్ర ప్రసాద్) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం కొంతమేర ఎమోషనల్గా సాగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు డిఫరెంట్గా ప్లాన్ చేశాడు దర్శకుడు. ఓ యంగ్ హీరో తో పాటు ఇద్దరు హీరోయిన్లు గెస్ట్ అప్పీయరెన్స్ ముగింపు మరింత కొత్తగా అనిపిస్తుంది. ముందుగా చెప్పినట్లు చెప్పుకోవడానికి పెద్ద కథ లేకపోయినా.. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటాం. ఎలాంటి అంచనాలు లేకుండా.. కొత్తదనం ఆశించకుండా సినిమాకు వెళితే మాత్రం కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. శ్రీవిష్ణు ఓ సినిమా ఒప్పుకున్నాడంటే..అందులో కొత్త పాయింట్ అయినా ఉండాలి లేదంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా అందించాలి. ఇది రెండో రకం సినిమా. దానికి తగ్గట్లుగానే శ్రివిష్ణు తనదైన బాడీ లాంగ్వేజ్తో నవ్వులు పూయించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇదే సినిమాకు ప్లస్ అయింది. రొటీన్ సీన్లను కూడా తనదైన నటనతో హీలేరియస్గా మార్చేశాడు. ఇందులో బూతు డైలాగులు ఉన్నప్పటికీ.. అవి బూతులు అనే విషయం తెలియకుండా శ్రీవిష్ణు తనదైన డైలాగ్ డెలివరీతో మ్యానేజ్ చేశాడు. శ్రీవిష్ణుకి తోడుగా వెన్నెల కిశోర్ ఉండడం మరో ప్లస్ పాయింట్. కామెడీ విషయంలో వీరిద్దరు పోటీపడి నటించారు. కేతికా శర్మ, ఇవానా కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక రాజేంద్రప్రసాద్ తెరపై కనిపించేంది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ చంద్ర శేఖర్ అందించిన పాటలు గుర్తుంచుకునే విధంగా ఉండవు కానీ కథలో భాగంగా వస్తూ.. వినసొంపుగానే ఉంటాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్, ఆర్ట్స్ డిపార్ట్మెట్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉనాయి. -
ఆ డ్రామాలు నాకు నచ్చవు: కేతికా శర్మ
-
ఆ దర్శకుడు నన్ను కొట్టలేదు.. బాగా చూసుకున్నాడు: హీరోయిన్
తమిళ దర్శకుడు బాలా గురించి ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలియదు. ఎందుకంటే అప్పట్లో శివపుత్రుడు, సేతు, నేనే దేవుడిని, వాడు వీడు, పరదేశి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నారు. తర్వాత కాలంలో పూర్తిగా దర్శకత్వం తగ్గించేశారు. అయితే సెట్ లో హీరోహీరోయిన్లని ఈయన కొడతారనే టాక్ ఉంది. ఇప్పుడు ఈ విషయమై యువ హీరోయిన్ ఇవానా రియాక్ట్ అయింది.'లవ్ టుడే' సినిమాతో హీరోయిన్ గా ఫేమస్ అయిన ఇవానా.. అంతకు ముందే తమిళంలో బాలా దర్శకత్వంలో 'నాచియార్'(తెలుగులో ఝాన్సీ) సినిమాలో ఈమె ఓ పాత్ర పోషించింది. అయితే ఈ మూవీ చేసేటప్పటికీ తాను 12వ తరగతి చదువుతున్నానని, సెట్ అంతా చాలా కొత్తగా అనిపించేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా) అయితే బాలా తనని ఎప్పుడు కొట్టలేదని, షూటింగ్ టైంలో చాలా బాగా చూసుకున్నారని ఇవానా చెప్పుకొచ్చింది. కాకపోతే యాక్టింగ్ స్కూల్ లా సెట్ వాతావరణం అంతా చాలా స్ట్రిక్ట్ గా ఉండేదని అప్పటి విషయాల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.'లవ్ టుడే' తర్వాత అదే హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'లో అతిథి పాత్రలో కనిపించింది. తెలుగులోనూ ఈమెకు రెండు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అందులో ఒకటైన '#సింగిల్' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం (మే 09) థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్) -
‘సింగిల్’కాల్లో అతనికి ‘శుభం’ చెప్పేశా: సమంత పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత(samantha) నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీస్ పిక్చర్స్లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’(subham movie) మే 9న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సమంత ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్ని తన భుజాన వేసుకొని ముందుకు సాగుతోంది. వరుస ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్కి తన స్నేహితులను కూడా వాడుకుంటుంది. తాజా వెన్నెల కిశోర్తో కలిసి ఓ ఫన్ వీడియో కూడా చేసింది. ఈ వీడియోలో సమంత ‘ నా శుభం మూవీ ప్రీమియర్స్కి రావట్లేదా’ అని అడుగుతుంది. వెన్నెల కిశోర్ ఏమో తన నటించిన ‘సింగిల్’(#single) మూవీ కూడా అదే రోజు(మే 9) రాబోతుందని చెప్పాలనుకుంటాడు. కానీ సమంత అతన్ని మాట్లాడనీయకుండా.. ‘నువ్వు, నీ ఫ్యామిలీ తప్పకుండా వస్తారు కదా? నేను నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది తప్పుకుండా రావాలి’ అంటూ గబగబా మాట్లాడేస్తుంది. చివరికి నువ్వు కచ్చితంగా వస్తున్నావు అని కట్ చేసేస్తది. ఈ వీడియోని సమంత తన ఇన్స్టాలో షేర్ చేస్తూ.. సింగిల్ ఫోన్ కాల్లో వెన్నెల కిశోర్కి శుభం చెప్పేశా.. మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఆ మార్పు కి నేను సిద్ధంగా ఉన్నాను: హీరో శ్రీవిష్ణు
‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్ల అవుతుంది. ఈ పదహారేళ్లలో ఎక్కడ కూడా బోర్ కొట్టించని సినిమాలే చేశానని భావిస్తున్నాను. రానున్న రొజులలో చాలా మార్పులు రాబోతున్నాయి. పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ రాబోతున్నారు. ఆ మార్పు కి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి క్యారెక్టర్ లో ది బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం #సింగిల్(#single movie). కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ రాజు దర్శకత్వం వహించారు. మే9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో శ్రీవిష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ డైరెక్టర్ కార్తీక్ రాజు ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా మంచి ఎంటర్టైనర్ అవుతుందని నమ్మకం కలిగింది. ఫైనల్ గా సినిమా చూసుకున్న తర్వాత చాలా పెద్ద ఎంటర్టైనర్ అవుతుందని అనిపించింది.ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఇదంతా టీమ్ ఎఫర్ట్ అని భావిస్తున్నాను.→ ఈ సినిమా క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. నా క్యారెక్టర్, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్. ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ నాలుగు క్యారెక్టర్లు కూడా ఆడియన్స్ కి చాలా నచ్చుతాయి. క్లైమాక్స్ చాలా యూనిక్ గా ఉంటుంది. అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.→ సినిమాని కంప్లీట్ గా హైదరాబాద్ లో తీసాం. హైదరాబాద్ని చాలా కొత్తగా చూపించాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ని ఇంత కొత్తగా ఎవరు చూపించలేదు. చాలా బెస్ట్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేశాం. → నేను ప్రతి క్యారెక్టర్ నీ ఎంజాయ్ చేస్తాను. డైరెక్టర్ తోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఆ ట్రావెల్ లోనే 50% వచ్చేస్తుంది. తర్వాత లొకేషన్ లో ఇంకొంత క్యారెక్టర్ మీద కమాండ్ పెరుగుతుంది.→ ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. ఇందులో లవ్స్టోరీ ఉంటుంది. దానికి తగ్గట్లుగానే నా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఆడియన్స్ చూస్తారు.→ సినిమా ఒక హైపర్ ఎనర్జీతో వచ్చింది. దానికి తగ్గట్టు విశాల్ చంద్రశేఖర్ ఎనర్జిటిక్ సాంగ్స్ ఇచ్చారు. ఆర్ఆర్ చాలా బాగా చేశారు. చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఇన్నోవేటివ్ సౌండ్ ఉంటుంది→ సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో స్వాగ్ ఒక ఫుల్ కామెడీ సినిమా అనుకున్నారు. మేము కూడా ప్రాపర్ కంటెంట్ ఇలా ఉంటుందని ప్రిపేర్ చేయలేకపోయాం. అందుకే చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడిందని అనుకుంటున్నాను. ఫుల్ ఫన్ అని వచ్చిన వాళ్ళు కొంత డిసప్పాయింట్మెంట్ అయిన మాట నిజమే. ఒక డిఫరెంట్ కంటెంట్ సినిమా చూడాలనే ఆడియన్స్ కి సినిమా చాలా నచ్చింది. టెలివిజన్ లో వచ్చిన తర్వాత కూడా చాలా మంచి అప్లోజ్ వచ్చింది. ప్రయోగం చేసినప్పుడు వర్క్ కాకపోతే దానిని ఎక్స్పీరియన్స్ కింద చూడాలి. వర్క్ అయినా వర్క్ కాకపోయినా కొత్త ప్రయత్నం మానకూడదని నా అభిప్రాయం.→ గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పటినుంచో గీతా ఆర్ట్స్ లో చేయాలి. లక్కీగా ఈ సినిమా కుదిరింది 100% కాన్ఫిడెన్స్ ఉన్న జోనర్ ఇది. ఈ జోనర్ లో గీత ఆర్ట్స్ తో చేయడం వెరీ వెరీ హ్యాపీ.→ ప్రస్తుతం మృత్యుంజయ అనే ఒక థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను.అలాగే ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాను. -
ఆ డ్రామాలు నాకు నచ్చవు: కేతికా శర్మ
‘‘కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. హిట్, ఫ్లాప్స్ మన చేతిలో ఉండవు. ఓ నటిగా పని చేయడం మాత్రమే నా చేతిలో ఉంటుంది. ఇండస్ట్రీలో కొనసాగడం లక్గా భావిస్తున్నా’’ అన్నారు కేతికా శర్మ. శ్రీవిష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘సింగిల్’. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేతికా శర్మ మాట్లాడుతూ– ‘‘సింగిల్’ సినిమాలో ఆడీ కంపెనీలో పని చేసే పూర్వ అనే అమ్మాయిపాత్ర చేశాను.పూర్వ స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఈ మూవీలోని లవ్స్టోరీ వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. అల్లు అరవింద్గారి సమర్పణలో గీతా ఆర్ట్స్లో ఓ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది. కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే ఈ సినిమా ఇంట్రవెల్ సీక్వెన్స్ చాలా సవాల్గా అనిపించింది. ఇక ‘రాబిన్ హుడ్’ సినిమాలో నేను చేసిన ‘అదిదా సర్ప్రైజ్’లాంటి డ్యాన్స్ మూమెంట్స్ ఈ మూవీలో లేవు.సెట్స్లో దర్శకులు ఏదీ చెబితే అది చేస్తాను. అలా ‘అదిదా సర్ప్రైజ్’ సాంగ్ చేశాను. ఈ సాంగ్లోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్పై భిన్నా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భవిష్యత్లో అలాంటి మూమెంట్స్పై జాగ్రత్తలు తీసుకుంటా. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. మీరు లైఫ్లో సింగిల్గా ఉన్నారా? అన్న ప్రశ్నకు... ‘‘ప్రస్తుతం సింగిల్గా ఉన్నాను. రిలేషన్షిప్ అంటూ లేనిపోని డ్రామాలు నాకు నచ్చవు. నిజాయితీగా ఉండాలి. రైట్ పర్సన్ దొరికితే... ప్రేమిస్తాను’’ అని చె΄్పారు కేతికా శర్మ. -
నా వయస్సు పెరిగింది.. రివ్యూల నంబర్ కూడా పెరగాలి: శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం సింగిల్ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి డైరెక్టర్గా కార్తీక్ రాజు పనిచేస్తున్నారు. ఇటీవలే సింగిల్ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే శ్రీ విష్ణు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సినిమాలో రివ్యూల అంశంపై ఆయన మాట్లాడారు. రివ్యూలను మనం ఆపలేము.. మార్చలేము అన్నారు. కానీ రేటింగ్ నంబర్స్ మారితే బాగుంటుందని శ్రీ విష్ణు తెలిపారు.(ఇది చదవండి: 'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు)నా చిన్నప్పటి నుంచి ఇండియన్ రూపీతో పాటు అన్ని మారుతూ వచ్చాయని అన్నారు. నా వయస్సు కూడా పెరిగిందని.. అలాగే రేటింగ్ సిస్టమ్లో ఐదు పాయింట్లకు బదులు 50 నుంచి 100కు పెంచితే బాగుంటుందని శ్రీ విష్ణు సూచిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ అయినా అనలిస్ట్ల్లాగే.. ఇది కూడా అనలైసిసే కదా అన్నారు. రివ్యూల్లో చెప్పేది కొన్నిసార్లు కరెక్ట్ కావొచ్చు.. కాకపోవచ్చని తెలిపారు. ఎక్కువ నంబర్స్ ఇస్తే బాగుంటుందని.. ఒక్కసారి ట్రై చేయాలని శ్రీ విష్ణు సూచించారు. -
కావాలని అలా చేయలేదు: కార్తీక్ రాజు
‘‘నేను తమిళ డైరెక్టర్ని కావడంతో ‘సింగిల్’ సినిమాకు తెలుగు నేటివిటీ ఉండాలని ‘సామజ వరగమన’ సినిమాకు పని చేసిన భాను–నందు తెలుగు డైలాగ్స్ రాశారు. ఈ మూవీ ట్రైలర్లోని కొన్ని డైలాగ్స్పై అభ్యంతరాలు ఎదురయ్యాయి. అయితే ఆ డైలాగులు కేవలం వినోదం కోసం పెట్టినవే.. కావాలని అలా చేయలేదు.. ట్రోల్ అవ్వాలని కాదు’’ అని డైరెక్టర్ కార్తీక్ రాజు అన్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘సింగిల్’. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్ కీలకపాత్ర చేశారు.అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ–‘‘వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పోకిరి, ఒక్కడు, వర్షం, అతడు’ సినిమాలకు పని చేశాను. దర్శకత్వంపై ఆసక్తితో సూపర్ వైజర్గా రాజీనామా చేశాను. దర్శకుడిగా నా తొలి సినిమా ‘తిరు డాన్ పొలీస్’ను ఎస్పీ చరణ్గారు నిర్మించారు. తెలుగులో సందీప్ కిషన్తో నా తొలి మూవీ ‘నిను వీడని నీడను నేనే’. శ్రీవిష్ణుగారికి ‘సింగిల్’ కథను 2022 వినిపించగా ఓకే అన్నారు. 2023లో గీతా ఆర్ట్స్ వారు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు. స్కూల్ డేస్ నుంచి లవ్లో పడాలనుకునే అబ్బాయికి, 28 ఏళ్ల వయసు వచ్చినా లవ్లో పడలేకపోతాడు. దీంతో తన చుట్టూ ఉన్నవాళ్లు ఎవరూ ప్రేమలో పడకూడదనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ. అల్లు అరవింద్గారితో వర్క్ చేయడం నా అదృష్టం. విశాల్ చంద్రశేఖర్గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. శ్రీవిష్ణుగారి కోసం నా వద్ద మరో రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అని తెలిపారు. -
'#సింగిల్'తో అదృష్టం పరీక్షించుకోనున్న ఇవానా (ఫొటోలు)
-
'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు
శ్రీ విష్ణు (Sree Vishnu).. వరుస హిట్స్తో ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు సింగిల్ సినిమా (Single Movie)తో మరో హిట్ను తన ఖాతాలో వేసుకునే ప్లాన్లో ఉన్నాడు. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే బ్యూటీ ఇవానా హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.హర్టయిన మంచు విష్ణు!ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సింగిల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ను రీక్రియేట్ చేశారు. నందమూరి బాలకృష్ణ.. హనీరోజ్తో మలయాళం మాట్లాడేందుకు ప్రయత్నించినదాన్ని సినిమాలో వాడేశారు. అలాగే మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని శివయ్యా అనే డైలాగ్ను కూడా సింగిల్ మూవీలో రిపీట్ చేశారు. ఇది చూసిన కన్నప్ప టీమ్ హర్టరయ్యారని తెలిసి శ్రీ విష్ణు.. వారికి సారీ చెప్పాడు.మీమ్స్ వాడాం..శ్రీ విష్ణు మాట్లాడుతూ.. సింగిల్ సినిమా ట్రైలర్లోని కొన్ని డైలాగులకు కన్నప్ప టీమ్ (Kannappa Movie) హర్టయిందని తెలిసింది. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. మేం కావాలని చేయలేదు. కానీ, అది తప్పుగా జనాల్లోకి వెళ్లడం వల్ల ఆ డైలాగ్స్ను డిలీట్ చేశాం. సినిమాలో కూడా ఆ డైలాగ్స్ ఉండవు. ఎవరినీ హర్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ఈ జనరేషన్లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్, సినిమా క్లిప్పింగ్స్ కానీ, బయట ఎక్కువ వైరల్ అయ్యేవాటిని తీసుకుని దాన్ని రీక్రియేట్ చేశాం.క్షమించండి: శ్రీ విష్ణుఆ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్.. ఇలా అందరి డైలాగ్స్ వాడాం. ఎవరికైనా మా వల్ల ఇబ్బంది కలిగితే మమ్మల్ని క్షమించండి. ఇకపై మా టీమ్ నుంచి అలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాం. ఇండస్ట్రీలో ఉన్న అందరం కూడా ఒక కుటుంబంలాగా ఉంటాం. ఒకరినొకరు కించపరుచుకోవాలన్న దురుద్దేశమైతే మాకు లేదు. హర్టయినవారికి క్షమాపణలు చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నా అన్నాడు శ్రీవిష్ణు. ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రంలో శివయ్యా అనే డైలాగ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నారు.చదవండి: HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ -
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
పవన్ కల్యాణ్ ఏళ్లకేళ్లుగా చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. నాలుగైదేళ్లుగా సెట్స్ మీదే ఉంది. మే 9న పక్కా థియేటర్లలోకి వస్తామని పోస్టర్స్ మీద పోస్టర్లు వదిలారు. తీరా చూస్తే ఇప్పుడు సౌండ్ లేదు. దీంతో వాయిదా లాంఛనమే. మరోవైపు ఈ తేదీని ఇప్పుడు మరికొన్ని తెలుగు మూవీస్ పట్టేస్తున్నాయి. (ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్) మే 9 టాలీవుడ్ కి చాలా అచ్చొచ్చిన తేదీ. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి.. ఇలా చెప్పుకొంటూపోతే ఆ రోజున థియేటర్లలో రిలీజై హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. 'హరిహర..' కూడా అదే తేదీ అనేసరికి ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఇప్పుడు మే 23న లేదంటే జూన్ 4న రావొచ్చని టాక్ వినిపిస్తుంది.పవన్ సినిమా వాయిదా లాంఛనమే అని తెలియడానికి మరోలా కూడా క్లారిటీ వచ్చింది. కొన్నిరోజుల క్రితం సమంత నిర్మించిన 'శుభం' మూవీ ఇదే తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు శ్రీ విష్ణు '#సింగిల్' కూడా మే 9న థియేటర్లలోకి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇలా వరస చిత్రాలు ఆ తేదీన రాబోతున్నాయంటే పవన్ మూవీ మరోసారి వాయిదా పడ్డట్లేగా.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
ఒక్క సినిమా..రెండు కోట్లు!
ఇన్నాళ్లకు... ఇన్నేళ్లకు నయనతార సొంత గొంతుని వినే అదృష్టం ప్రేక్షకులకు కలగనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పదేళ్లలో ఎన్నో సినిమాలు చేసిన నయనకు ఇంతవరకూ ఎవరెవరో డబ్బింగ్ చెప్పారు. తెలుగులో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో మాత్రం తొలిసారిగా డబ్బింగ్ చెప్పుకున్నారామె. ఆమె డబ్బింగ్కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పటివరకు తమిళ ప్రేక్షకులకు మాత్రం నయనతార గొంతు వినే భాగ్యం కలగలేదు. ఈ ఏడాది అక్కడి ప్రేక్షకులకు కూడా తన మధురమైన కంఠస్వరాన్ని వినిపించాలని నయనతార నిర్ణయించుకున్నారు. మాజీ ప్రియుడు శింబు సరసన నయనతార ‘ఇదు నమ్మ ఆళు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఈ జంట నటిస్తున్న సినిమా ఇది. ఈ కథ, పాత్ర చెప్పి, ఈ సినిమా మీరు చేస్తే బాగుంటుందని అటు శింబు... ఇటు నయన్కి చెప్పి, జత కలిపారు ఈ చిత్రదర్శకుడు పాండిరాజ్. ఆ విషయంలో విజయం సాధించిన పాండిరాజ్, నయనతారతో డబ్బింగ్ కూడా చెప్పించేస్తున్నారు. ‘మీ గొంతు వినిపిస్తేనే పాత్ర ఎలివేట్ అవుతుంది’ అని నయనకి చెప్పడం, ఆమె ఒప్పుకోవడం జరిగింది. శింబు, నయనతార నటించడంవల్ల ఇప్పటికే ఈ చిత్రానికి భారీ ఎత్తున క్రేజ్ ఏర్పడింది. ఇక, నయనతార గొంతు అదనపు ఆకర్షణ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొసమెరుపు ఏంటంటే.. తమ కలయికలో సినిమా అంటే.. బిజినెస్పరంగా చాలా క్రేజ్ ఉంటుందని గ్రహించిన నయనతార, ఇప్పటివరకూ ఏ సినిమాకీ తీసుకోనంత భారీ పారితోషికం తీసుకున్నారట. మామూలుగా ఒక సినిమా కోటి నుంచి కోటిన్నర రూపాయల లోపు తీసుకుంటారు. అంతకన్నా భారీ అంటే.. రెండు కోట్ల దాకా తీసుకొని ఉంటారని కోలీవుడ్ టాక్.